| Daily భారత్
Logo




ఐటిడిఏ కాంప్లెక్స్‌ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి

News

Posted on 2026-03-09 19:19:18

Share: Share


ఐటిడిఏ కాంప్లెక్స్‌ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి

అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలి

ఐ టి డి ఏ ఏపీఓకు  సామాజిక సేవకులు కర్నే బాబురావు వినతి

డైలీ భారత్, మణుగూరు: మణుగూరు పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లోని ఐటిడిఏ షాపింగ్ కాంప్లెక్స్‌ లో గిరిజనులకు కేటాయించిన వ్యాపార దుకాణాలను అన్యాక్రాంతం మవుతున్నాయని, దుకాణాలను గిరిజనుల నుండి దక్కించుకున్న కొందరు  గిరిజనే తరులు వ్యాపారం వ్యాపారాలు సాగించడంతోపాటు, చిరు వ్యాపారులనుండి రోజువారీగా అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని, అధికారులు వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని సామాజిక సేవకులు కర్నే బాబురావు సొమవారం ఐ టి డి ఏ ఏ పీ ఓ డేవిడ్ రాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాబురావు విలేకరులతో మాట్లాడుతూ,మణుగూరు పట్టణంలో  గిరిజనుల స్వయం ఉపాధి అభివృద్ధి కోసం నిర్మించిన ఐటిడిఏ కాంప్లెక్స్ ప్రస్తుతం అసలు ఉద్దేశానికి విరుద్ధంగా ఉపయోగించబడుతోందని తెలిపారు. కాంప్లెక్స్‌లోని దుకాణాల్లో ఒకటి రెండు మినహా మిగతావి గిరిజనేతరుల ఆధీనంలో ఉండటం వల్ల నిజమైన గిరిజనులకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా షాపుల ముందు తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తున్న చిన్నచిన్న వ్యాపారుల వద్ద నుండి వారు  నెలకు రూ.3,000 నుంచి రూ.4,000 వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. కొందరు గిరిజనులు తమకు కేటాయించిన దుకాణాలను గిరిజనేతరులకు అద్దెకిస్తూ నెలవారీగా కిరాయిలు పొందుతున్నారన్నారు. ఈ సమస్యపై మణుగూరు మున్సిపాలిటీ కమిషనర్‌కు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. దీంతో అక్రమ వసూళ్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఐ టి డి ఏ  అధికారులు సమగ్రంగా పరిశీలించి తక్షణ విచారణ జరిపించి, అక్రమ వసూళ్లు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఐటిడిఏ కాంప్లెక్స్‌లోని దుకాణాలను నిజమైన గిరిజనులకు మాత్రమే కేటాయించి వారి హక్కులను పరిరక్షించాలని కర్నే బాబురా వు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేనిచో విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని పేర్కొన్నారు.

Image 1

గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళకు సకాలంలో రక్తం అందజేత

Posted On 2026-04-29 19:01:13

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల జిల్లా : హత్య కేసులో నలుగురు నిందుతులకు యావజ్జీవ కారాగార (జీవిత ఖైదు) శిక్ష

Posted On 2026-04-29 18:50:39

Readmore >
Image 1

చలివేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ రావుల వినోద ప్రభాకర్

Posted On 2026-04-29 18:41:17

Readmore >
Image 1

మంత్రి సీతక్కని కలిసిన కామారెడ్డి జిల్లా డిసిసి ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

Posted On 2026-04-29 18:39:55

Readmore >
Image 1

పదవ తరగతి ఫలితాల్లో పాపకొల్లు జడ్పీహెచ్ఎస్ మండల టాపర్ కే పూజిత 565

Posted On 2026-04-29 18:37:39

Readmore >
Image 1

ఆస్తి కోసం కన్నవారిపై కక్ష... సొంత ఇంటికే నిప్పు పెట్టిన కుమార్తె!..

Posted On 2026-04-29 17:26:42

Readmore >
Image 1

హుస్నాబాద్‌లో అబ్బురపరిచే గాజు వంతెన !

Posted On 2026-04-29 08:29:53

Readmore >
Image 1

సోదరి అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన గిరిజనుడు

Posted On 2026-04-28 23:09:39

Readmore >
Image 1

కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి

Posted On 2026-04-28 22:51:46

Readmore >
Image 1

విలువలు కూలిపోతున్న నాలుగవ స్తంభం...?

Posted On 2026-04-28 22:47:26

Readmore >