Posted on 2026-03-08 19:12:13
డైలీ భారత్, వేములవాడ: వేములవాడ పట్టణంలో జరిగిన భూక్య మోహన్ హత్య కేసును వేములవాడ టౌన్ పోలీసులు త్వరితగతిన ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
దర్యాప్తులో భాగంగా మృతుడు భూక్య మోహన్ కు బైరి శారద @ కళ్యాణి (నర్స్, అంజనీ నగర్, వేములవాడ) తో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. మోహన్ తరచూ డబ్బులు అడుగుతూ మరియు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించడంతో, శారద తన భర్త బైరి శేకర్ తో కలిసి మోహన్ ను హత్య చేయాలని పథకం రచించారు. ఈ పథకంలో గుండం రవి @ రవీందర్ కూడా సహకరించాడు.
తేదీ 04-03-2026 న శారద మోహన్ ను వేములవాడలోని సిద్ధార్థ కాంప్లెక్స్ కు పిలిపించగా, అక్కడికి వచ్చిన శేకర్ మరియు రవి కలిసి నైలాన్ తాడుతో ఉరివేసి మోహన్ ను హత్య చేశారు.
తిప్పాపూర్ బస్ స్టాండ్ వద్ద నిందితులు బైరి శారద, బైరి శేకర్ మరియు గుండం రవి లను పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన బైక్, నైలాన్ తాడు మరియు చాకు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ కు తరలించారు.
ఈ కేసును త్వరితగతిన ఛేదించిన వేములవాడ టౌన్ CI వీర ప్రసాద్, SI రామ్మోహన్, SI ప్రేమానందం, PC ఇమ్రాన్, PC సల్మాన్, PC శ్రీనివాస్ లను శ్రీనివాసులు, డిఎస్పీ వేములవాడ అభినందించారు.
పరిశ్రమల అభివృద్ధికి అధికారులు మార్గదర్శకులుగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-06-05 21:46:24
Readmore >
విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు
Posted On 2026-06-05 21:41:53
Readmore >
సుజాతనగర్లో అక్రమంగా పశువుల రవాణా చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
Posted On 2026-06-05 21:27:15
Readmore >
500 మంది పోలీసుల మెరుపు దాడి.. ఉలిక్కిపడ్డ స్పా సెంటర్ల నిర్వాహకులు
Posted On 2026-06-05 20:42:30
Readmore >
దమ్మపేట ఎస్సై రాజేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఆటో డ్రైవర్స్ యూనియన్
Posted On 2026-06-05 20:16:20
Readmore >
ఆల్ ఇండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్లో కాంస్య పతకం సాధించిన మహిళా కానిస్టేబుల్ సౌభాగ్యా కు ఎస్పీ అభినందనలు
Posted On 2026-06-05 20:14:05
Readmore >