| Daily భారత్
Logo




వేములవాడ : హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

News

Posted on 2026-03-08 19:12:13

Share: Share


వేములవాడ : హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్

డైలీ భారత్, వేములవాడ: వేములవాడ పట్టణంలో జరిగిన భూక్య మోహన్ హత్య కేసును వేములవాడ టౌన్ పోలీసులు త్వరితగతిన ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

దర్యాప్తులో భాగంగా మృతుడు భూక్య మోహన్ కు బైరి శారద @ కళ్యాణి (నర్స్, అంజనీ నగర్, వేములవాడ) తో అక్రమ సంబంధం ఉన్నట్లు తెలిసింది. మోహన్ తరచూ డబ్బులు అడుగుతూ మరియు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు బయటపెడతానని బెదిరించడంతో, శారద తన భర్త బైరి శేకర్ తో కలిసి మోహన్ ను హత్య చేయాలని పథకం రచించారు. ఈ పథకంలో గుండం రవి @ రవీందర్ కూడా సహకరించాడు.

తేదీ 04-03-2026 న శారద మోహన్ ను వేములవాడలోని సిద్ధార్థ కాంప్లెక్స్ కు పిలిపించగా, అక్కడికి వచ్చిన శేకర్ మరియు రవి కలిసి నైలాన్ తాడుతో ఉరివేసి మోహన్ ను హత్య చేశారు.

తిప్పాపూర్ బస్ స్టాండ్ వద్ద నిందితులు బైరి శారద, బైరి శేకర్ మరియు గుండం రవి లను పోలీసులు అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి నేరానికి ఉపయోగించిన బైక్, నైలాన్ తాడు మరియు చాకు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, రిమాండ్ కు తరలించారు.

ఈ కేసును త్వరితగతిన ఛేదించిన వేములవాడ టౌన్ CI వీర ప్రసాద్, SI రామ్మోహన్, SI ప్రేమానందం, PC ఇమ్రాన్, PC సల్మాన్, PC శ్రీనివాస్ లను శ్రీనివాసులు, డిఎస్పీ వేములవాడ అభినందించారు.

Image 1

“LSRW" నైపుణ్యాలతో ఆంగ్ల భాషలో అద్బుత అవకాశాలు

Posted On 2026-03-09 20:25:04

Readmore >
Image 1

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-09 20:20:14

Readmore >
Image 1

ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు... కలెక్టర్ గరిమ అగ్రవాల్

Posted On 2026-03-09 19:45:58

Readmore >
Image 1

పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష...

Posted On 2026-03-09 19:25:55

Readmore >
Image 1

మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారిన భద్రాచలం ఎస్సీ కమ్యూనిటీ హాల్

Posted On 2026-03-09 19:22:17

Readmore >
Image 1

కొమ్ముగూడెం గ్రామంలో నూతన పశువుల ఆసుపత్రి భవనాన్ని నిర్మించండి

Posted On 2026-03-09 19:20:29

Readmore >
Image 1

ఐటిడిఏ కాంప్లెక్స్‌ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి

Posted On 2026-03-09 19:19:18

Readmore >
Image 1

కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు

Posted On 2026-03-09 19:17:48

Readmore >
Image 1

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ ర్యాలీ

Posted On 2026-03-09 19:09:41

Readmore >
Image 1

మద్యం మత్తులో వాహనం నడిపితే… జైలు జీవితం తప్పదు!

Posted On 2026-03-09 19:08:37

Readmore >