| Daily భారత్
Logo




₹35 వేల లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఎగ్జామినర్ పట్టుబాటు

News

Posted on 2026-03-06 07:54:12

Share: Share


₹35 వేల లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఎగ్జామినర్ పట్టుబాటు

డైలీ భారత్, హైదరాబాద్: హైదరాబాద్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో జీహెచ్ఎంసీ అకౌంట్స్ విభాగానికి చెందిన ఒక అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న జీహెచ్ఎంసీ అకౌంట్స్ సెక్షన్ ఎగ్జామినర్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు.

అధికారుల వివరాల ప్రకారం, ఒక ఉద్యోగికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్‌ను జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయానికి పంపించేందుకు ఆ అధికారి ₹40,000 లంచం డిమాండ్ చేశాడు. చర్చల అనంతరం ₹35,000 తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పన్నిన ఉచ్చులో చిక్కుకున్నాడు.

లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అరెస్ట్ చేసి, అతనిపై అవినీతి నిరోధక చట్టాల ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Image 1

వరదలు, ప్రకృతి వైపరీత్యాలను ఎదురుకునేందుకు అన్ని శాఖలు సమన్వయంగా పనిచేయాలి

Posted On 2026-06-03 20:01:51

Readmore >
Image 1

జనసేన పార్టీలో తెలంగాణ రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు

Posted On 2026-06-03 20:00:43

Readmore >
Image 1

వార్డులలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలి

Posted On 2026-06-03 19:59:40

Readmore >
Image 1

భయాలు (Phobias)... చిన్ననాటి భయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయా?

Posted On 2026-06-03 19:04:31

Readmore >
Image 1

నకిలీ పోలీసుల ముఠా గుట్టురట్టు

Posted On 2026-06-03 18:58:44

Readmore >
Image 1

సీపీఆర్ చేసి నిండు ప్రాణాన్ని కాపాడిన కోర్టు కానిస్టేబుల్ భాస్కర్

Posted On 2026-06-03 18:14:16

Readmore >
Image 1

కోనరావుపేట మండలంలో ప్లాస్టిక్ రహిత ధర్మారం లక్ష్యంగా ముందడుగు

Posted On 2026-06-03 16:16:28

Readmore >
Image 1

కామారెడ్డి జిల్లా తెలంగాణ పిఆర్టియు ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన మహోత్సవం

Posted On 2026-06-03 16:10:41

Readmore >
Image 1

భూ తగాదాల్లో సెటిల్‌మెంట్లు చేసేవారికి “కౌన్సిలింగ్” ఇవ్వండి : వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్.

Posted On 2026-06-03 16:08:42

Readmore >
Image 1

వెంకటసాయి నగర్‌ కాలనీ లో పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్ల మంజూరుకు ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన అధ్యక్షులు విజయేందర్ రెడ్డి

Posted On 2026-06-03 15:46:16

Readmore >