Posted on 2026-03-02 20:46:42
నిజామాబాద్లో 24×7 కంట్రోల్ రూమ్ ఏర్పాటు సీపీ పి. సాయి చైతన్య వెల్లడి
డైలీ భారత్, నిజామాబాద్: గల్ఫ్ దేశాలలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయుల, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన పౌరుల సహాయార్థం ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య తెలిపారు.
గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తమ కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవాలనుకునే వారికి సకాలంలో సమాచారం అందించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 గంటలు పనిచేసే ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రజల సౌకర్యార్థం న్యూఢిల్లీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ప్రారంభించింది. అక్కడి అధికారులతో సమన్వయం చేస్తూ నిజామాబాద్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. గల్ఫ్ దేశాల్లో ఉన్న వారి భద్రత, స్థితిగతులపై సమాచారం పొందడానికి కుటుంబ సభ్యులు వెంటనే కంట్రోల్ రూమ్ను సంప్రదించాలని సూచించారు.
సంప్రదించవలసిన నంబర్లు:
📞 నిజామాబాద్ పోలీస్ కంట్రోల్ రూమ్: 8712659700
📞 సర్కిల్ ఇన్స్పెక్టర్: 8712659821
ప్రజలు అపోహలు నమ్మకుండా అధికారిక సమాచారం కోసం మాత్రమే ఈ నంబర్లను సంప్రదించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
Posted On 2026-06-02 10:50:02
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >