Posted on 2026-02-26 19:44:54
నూతనంగా గెలిచిన కౌన్సిలర్లను సన్మానించిన మాజీ MLA గంప గోవర్ధన్, జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్
డైలీ భారత్, కామారెడ్డి: గురువారం రోజున మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్ గారి ని మర్యాదపూర్వకంగా పార్టీ ఆఫీసులో నూతనంగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికైన కాసర్ల గోదావరి స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు , వైస్ చైర్ పర్సన్ గా ఎంపిక చేసినందుకు సహకరించినటువంటి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తరపున మున్సిపల్ లో నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్లను మరియు ప్రత్యేకంగా మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గా గెలిచినటువంటి కాసర్ల గోదావరి స్వామి ని ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు..... మీ జీవితంలో మంచి రోజులు వచ్చాయని మరువలేని రోజులని ప్రజలకు ఎంతో సేవ చేయాలని అలాంటి భాగ్యం మీకు దక్కిందని మీరు ఎన్నడూ ప్రజలను మరువకూడదని అదే విధంగా పార్టీ ఎప్పుడూ మీకు వెన్నుదన్ను ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ముజీబుద్దిన్ టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి నాయకులు కుంభాల రవి యాదవ్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వంద తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
Posted On 2026-02-26 21:02:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : సిఎంఓ (CMO) అధికారిగా నటిస్తూ ప్రభుత్వ అధికారులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
Posted On 2026-02-26 20:20:41
Readmore >