Posted on 2026-02-26 17:27:16
బీజేపీ నాయకులు తంబల్ల రవి డిమాండ్
జామాయిల్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం బలి
ప్రాణం ఖరీదు1,40,000/- లా...?
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మూకమామిడి పంచాయితీ లో నిన్న 220/11 కెవి కరెంట్ బారిన పడి మృతిచెందిన ఛత్తీస్గఢ్ వలస గిరిజన కూలి కుటుంబాన్నీ ముళ్ళపల్లిలో పరామర్శించిన అశ్వారావుపేట బీజేపీ నాయకులు తంబళ్ల రవి,పొట్ట కూటి కోసం కూలి నిమిత్తం జమాయిల్ కటింగ్ కు వచ్చి 220/11 కేవి కరెంట్ వైరు తగిలి మృతిచెందిన వలస కూలి ఛత్తీస్గఢ్ ఆదివాసీ మడివి భద్రం కు న్యాయం చేకూర్చాలని,బాధిత కుటుంబాన్నీ పరామర్శించి మృతుడికి కాంట్రాక్టర్ నుండి తక్షణ నష్టపరిహారాన్ని మరియు వారికి ప్రమాద భీమా కూడా అందేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ బాధితుల తరుపున డిమాండ్ చేస్తుందనీ తెలిపారు,ప్రాణం ఖరీదు 1,40,000/- లుగా కేటాయిస్తూ పంచాయతీ చేయడం చాలా బాధాకరమని,జామాయిల్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణం పోయింది వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు,కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు,కొలికపోగు ముసల్య,నవీన్ తదితరులు పాల్గొన్నారు.
వంద తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
Posted On 2026-02-26 21:02:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : సిఎంఓ (CMO) అధికారిగా నటిస్తూ ప్రభుత్వ అధికారులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
Posted On 2026-02-26 20:20:41
Readmore >