Posted on 2026-02-26 14:26:09
డైలీ భారత్, సిరిసిల్ల: విధి నిర్వహణలో అప్రమత్తతతో అమూల్యమైన ప్రాణాలను కాపాడిన కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్లను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే అభినందించి ప్రశంస పత్రాలు, నగదు బహుమతులు అందజేశారు.
ఇటీవల వేములవాడ తిప్పపూర్ బస్టాండ్ వద్ద అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సీపీఆర్ (CPR) నిర్వహించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ గంగరాజును, అలాగే తంగళ్ళపల్లి వద్ద మానేరు వాగులో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన వ్యక్తిని ధైర్యసాహసాలతో రక్షించిన కానిస్టేబుళ్లు గంగరాజు, అనిల్లను ప్రత్యేకంగా అభినందించారు.
ప్రాణాపాయం లెక్కచేయకుండా సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణరక్షణ చేసినందుకు వారికి ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు అందజేసి సత్కరించారు.
ప్రజల ప్రాణరక్షణే పోలీస్ శాఖ ప్రధాన ధ్యేయమని, ఇదే సేవాభావంతో ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు.
వంద తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు : ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
Posted On 2026-02-26 21:02:50
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : సిఎంఓ (CMO) అధికారిగా నటిస్తూ ప్రభుత్వ అధికారులను మోసం చేసిన వ్యక్తి అరెస్ట్
Posted On 2026-02-26 20:20:41
Readmore >