Posted on 2026-02-22 03:26:01
డైలీ భారత్, సిరిసిల్ల: పదో తరగతి విద్యార్థులు అన్ని సబ్జెక్టులు చదవాలి రాయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పిలుపునిచ్చారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ వద్ద ఉన్న కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ శనివారం తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరు రిజిస్టర్లు పరిశీలించారు. కిచెన్, వంట గది, స్టోర్ రూమ్, భోజనానికి వినియోగించే ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. తరగతి గదుల్లో బోధన కొనసాగుతుండగా, పరిశీలించారు. పదో తరగతి గదికి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. అన్ని సబ్జెక్టుల సిలబస్ పూర్తి అయిందా అని ఇంచార్జి కలెక్టర్ ఆరా తీశారు. సైన్స్ కు సంబంధించి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులతో నాడీకణ నిర్మాణ నమూనాను బోర్డుపై గీసి దాని భాగాలు వివరిం చాలని సూచించారు. పలువురు విద్యార్థులు గీయగా, వారిని అభినందించారు. ఈ సందర్బంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. ప్రతి విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమని తెలిపారు. విద్యార్థులు ఒక ప్రణాళిక రూపొందించుకొని ప్రతి సబ్జెక్టుకు సంబంధించి గత ప్రశ్నాపత్రాలు సాధన చేయాలని సూచించారు. ఆ సమాధానాలను మరోసారి సమీక్ష చేసుకోవాలని పేర్కొన్నారు. పదో తరగతి మార్కులే ఉన్నత విద్యాభ్యాసంలో కీలకంగా మారుతాయని వివరించారు. ఇప్పటి అంశాలే రానున్న తరగతుల్లో మరింత విస్తృతంగా ఉంటాయని తెలిపారు. మంచిగా చదివి వివిధ ఉన్నత ఉద్యోగాలు, వృత్తుల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. కెరీర్ లో స్థిరపడిన తరువాతే మిగితా విషయాలు ఆలోచించాలని సూచించారు.
నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
విద్యాలయంపైన అదనపు తరగతి గదుల నిర్మాణాలపై టీజీఈడబ్ల్యూఐడీసీ ఏఈల నుంచి ఆరాతీశారు. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ ఆదేశించారు.
#rajannasircilla #sircillacollector #garimaagrawal #sircilla_rajanna_district
ఆర్యవైశ్య నాయకుడు కైలాష్ శ్రీనివాస్ పై చేసిన ఆరోపణలు నిరూపించాలి...భేషరతుగా క్షమాపణలు చెప్పాలి
Posted On 2026-02-22 16:12:51
Readmore >
కామారెడ్డి మున్సిపాలిటీ 20వార్డు కళ్ళే సావిత్రి సత్యం సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-02-22 16:11:02
Readmore >
అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం గట్టుప్పల్ మండల శాఖ అధ్యక్షుడిగా బండారు వంశీకృష్ణ
Posted On 2026-02-22 14:18:12
Readmore >
నిరుపేద వివాహ కుటుంబానికి చేయూతనిచ్చిన కౌన్సిలర్ కల్లూరి రేణుక-రాజు
Posted On 2026-02-22 10:04:47
Readmore >
అక్రమ సంబంధం ఎఫెక్ట్... ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన భార్య
Posted On 2026-02-22 07:47:41
Readmore >
అల్మాస్ పూర్ వద్ద ఉన్న కేజీబీవీలో ఆకస్మిక తనిఖీ చేసిన సిరిసిల్ల జిల్లా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-02-22 03:26:01
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: జ్యూరీ అవార్డుకు ఎంపికైన దమ్మన్నపేట విద్యార్థులు
Posted On 2026-02-21 14:48:27
Readmore >