Posted on 2026-02-21 14:48:27
డైలీ భారత్, దమ్మన్నపేట: అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు మహారాష్ట్ర పూణే నగర పరిధిలో గల చోండే ఫామ్స్ లో ఈనెల 17 18 తేదీల్లో జిజ్ఞాస పేరు తో జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఇట్టి వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మనపేట విద్యార్థులు 8వ తరగతి చదువుతున్న పొన్నాల నిహారిక రుతికలు పాల్గొన్నారు అని పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు భోయన్న గారి నారాయణ తెలియజేశారు వైజ్ఞానిక ప్రదర్శనలో జాతీయస్థాయిలో 100కు పైగా సృజనాత్మక ఆవిష్కరణలు ప్రదర్శించడం జరిగింది అందులో జ్యూరీ అవార్డుకు విద్యార్థులు ఎంపిక కావడం చాలా గొప్ప విషయం అన్నారు ఈ సందర్భంగా వారిని అభినందించడం జరిగింది అభినందించిన వారిలో ప్రధానోపాధ్యాయులు చింతపల్లి వెంకటేశ్వరరావు గ్రామ సర్పంచ్ దుంపల చంద్రశేఖర్ రెడ్డి ఉప సర్పంచ్ హమీద్ మరియు గ్రామ ప్రముఖులు ఉపాధ్యాయ బృందం ఉన్నారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించి పాఠశాలకు గ్రామానికి జిల్లాకు మంచి పేరు తేవాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు
రాజన్న సిరిసిల్ల జిల్లా: జ్యూరీ అవార్డుకు ఎంపికైన దమ్మన్నపేట విద్యార్థులు
Posted On 2026-02-21 14:48:27
Readmore >
నూతన దంపతులను ఆశీర్వదించిన ఖమ్మం జిల్లా ఎస్పీ సునీల్ దత్, ఏసిపి వెంకన్న బాబు
Posted On 2026-02-21 13:21:59
Readmore >
పురమిత్ర పిర్యాదులు వెంటనే పరిష్కరించండి : కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్
Posted On 2026-02-21 03:26:40
Readmore >
హైమాస్టర్ లైటింగ్ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు
Posted On 2026-02-20 16:29:31
Readmore >
షాద్నగర్ నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-02-20 14:22:43
Readmore >