Posted on 2026-02-21 13:27:09
మున్సిపల్ చైర్మన్ ను కలిసిన మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ బాబర్ ఖాన్,ఎం.డి.ఇబ్రహీం
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పట్టణంలో తగిన ఏర్పాట్లు చేయాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీ ఖాన్, మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇబ్రహీం మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వను కోరారు. శనివారం వారు మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో మసీదుల వద్ద పారిశుధ్యం, వీధి దీపాల ఏర్పాటు, నిరంతర మంచినీటి సరఫరా వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని విన్నవించారు. నేతల విన్నపంపై మున్సిపల్ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. పట్టణంలో రంజాన్ వేడుకలు ప్రశాంతంగా, ఘనంగా జరిగేలా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టి, సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా చైర్మన్ హామీ ఇచ్చారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా: జ్యూరీ అవార్డుకు ఎంపికైన దమ్మన్నపేట విద్యార్థులు
Posted On 2026-02-21 14:48:27
Readmore >
నూతన దంపతులను ఆశీర్వదించిన ఖమ్మం జిల్లా ఎస్పీ సునీల్ దత్, ఏసిపి వెంకన్న బాబు
Posted On 2026-02-21 13:21:59
Readmore >
పురమిత్ర పిర్యాదులు వెంటనే పరిష్కరించండి : కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్
Posted On 2026-02-21 03:26:40
Readmore >
హైమాస్టర్ లైటింగ్ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు
Posted On 2026-02-20 16:29:31
Readmore >
షాద్నగర్ నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-02-20 14:22:43
Readmore >