Posted on 2026-02-20 15:58:03
ఐడీఓసీలో నిర్వహించిన ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : ఆర్థిక పునరావాస సహాయ పథకానికి సంబంధించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. దివ్యాంగుల ఆర్థిక సహాయ పునరావాస పథకం కింద జిల్లాకు 14 యూనిట్లు మంజూరు కాగా ఒక్కో యూనిట్ విలువ రూపాయలు 50,000 వేలు. 100 శాతం రాయితీ ఉంటుంది. జిల్లాలోని ఆయా మండలాలకు చెందిన 38 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం(ఐడీఓసీ)లో శుక్రవారం దివ్యాంగులకు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. 37 మంది దివ్యాంగులు హాజరుకాగా, వారికి సంబంధించిన సర్టిఫికెట్లు, అర్హతలు పరిశీలించి వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో డీఆర్డీఓ గీత, డీడబ్ల్యూఓ లక్ష్మీరాజం, ఎస్సీ కార్పొరేషన్ అధికారి స్వప్న, ఏవో మెప్మా మీర్జా ఫసహత్ అలీ బేగ్ ఉన్నారు.
హైమాస్టర్ లైటింగ్ ప్రారంభించిన గ్రామ సర్పంచ్ బాదావత్ రాంబాబు
Posted On 2026-02-20 16:29:31
Readmore >
షాద్నగర్ నూతన మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపిన మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-02-20 14:22:43
Readmore >
స్కూల్లో మీ బిడ్డను కొడుతున్నారా? క్రమశిక్షణ పేరుతో హింసిస్తే టీచర్లపై కఠిన చర్యలు!
Posted On 2026-02-20 08:57:22
Readmore >
టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను కత్తితో పొడిచి చంపిన భార్య
Posted On 2026-02-20 06:09:15
Readmore >