Posted on 2026-02-20 18:52:43
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: షాద్నగర్ మున్సిపాలిటీ నూతన చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన అగ్గనూర్ బసవేశ్వర్, వైస్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన అందే మోహన్ లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. శుక్రవారం వారిని సీనియర్ నాయకులు ఎం.డి. ఇబ్రహీం పలువురు ముఖ్య నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎం.డి. ఇబ్రహీం మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన నాయకులు మున్సిపల్ బాధ్యతలు చేపట్టడం సంతోషకరమని, వారి నాయకత్వంలో షాద్నగర్ పట్టణం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలని ఆకాంక్షించారు. పట్టణంలోని మౌలిక సదుపాయాల కల్పనలో నూతన పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇసాక్, ముబారక్,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >
మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-30 22:23:35
Readmore >
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >
మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
Posted On 2026-05-30 17:52:53
Readmore >
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం
Posted On 2026-05-30 17:17:48
Readmore >
మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-05-30 17:15:14
Readmore >