Posted on 2026-02-15 12:56:23
వైద్య శిబిరం, మే ఐ హెల్ప్ యూ డెస్క్ ల పరిశీలన.
క్యూ లైన్లలోని భక్తులతో మాట్లాడిన ఇంచార్జి కలెక్టర్..
డైలీ భారత్, వేములవాడ: మహా శివరాత్రి జాతర సందర్భంగా శ్రీ భీమేశ్వర స్వామి వారిని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి పూజలు చేశారు. ఆలయం ఆవరణం వద్ద వైద్య శిబిరం, మే ఐ హెల్ప్ యూ డెస్క్ లను పరిశీలించారు. వైద్య శిబిరంలో ఏ ఏ మందులు అందుబాటులో ఉన్నాయో పరిశీలించారు. హెల్ప్ డెస్క్ లో సిబ్బంది తో మాట్లాడారు. అనంతరం క్యూ లైన్ల వద్ద భక్తులతో మాట్లాడి.. ఇక్కడ అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. వాలంటీర్లు నీటిని పంపిణీ చేస్తుండగా, పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది, హెల్ప్ డెస్క్ బాధ్యులకు పలు సూచనలు చేశారు.
కమాండ్ కంట్రోల్ రూం పరిశీలన
బీమేశ్వర సదన్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూం ను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే కలిసి పరిశీలించారు. అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఇక్కడ ఆలయ ఈఓ రమాదేవి, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, తహసీల్దార్ జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >