| Daily భారత్
Logo




తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు

News

Posted on 2026-02-10 15:52:53

Share: Share


తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలంఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతూ, నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేయాలని యత్నించిన నలుగురు నిందితులను  పోలీసులు అరెస్టు చేశారుచంద్రుగొండ సెంటర్ విజయవాడ-కొత్తగూడెం ప్రధాన రహదారి పై వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతూ పోలీసులను గమనించి పారిపోవడానికి ప్రయత్నించగా,  వెంబడించి పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద రూ.500/- విలువైన నకిలీ నోట్లు లభ్యమయ్యాయి. పట్టుబడిన వారిని విచారణ చేయగా నిందితులు గతంలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడైంది.విచారణలో బయటపడిన వివరాల ప్రకారం నిందితులు  తల్లాడ, ఏన్కూరు, జూలూరుపాడు, చంద్రుగొండ, అన్నపురెడ్డిపల్లి తదితర మండలాల పరిధిలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగలగొట్టి ఇళ్లలోకి ప్రవేశించి ఇనుప బీరువాలు పగలగొట్టి నగదు, బంగారు, వెండి ఆభరణాలను దొంగతనం చేశారు.దొంగతనాల ద్వారా పొందిన ఆభరణాలను విక్రయించి వచ్చిన డబ్బులతో హైదరాబాద్ నుండి నకిలీ ₹500 రూపాయల నోట్లను కొనుగోలు చేసి వాటిని కొత్తగూడెం, చంద్రుగొండ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు ప్రాంతాలలోని పాపుల్లో చలామణి చేసి అసలు నోట్లుగా మార్చి ప్రజలను మోసం చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు తేలింది. నిందితుల వద్ద నుండి మొత్తం రూ.3,50,000/- విలువ గల నకిలీ ₹500 నోట్లు, రూ.50,000/- అసలు నగదు మరియు 04 మొబైల్ ఫోన్లు స్వాధీనం పోలీసులు చేసుకోవడమైనది.

నిందితుల వివరాలుచిల్లరి సురేష్, 

.జల్లేపల్లి వెంకటేశ్వరరావు, 

 బండారి వంశీ, 

గాదె నాగరాజు,

నిందితులు తమ నేరాన్ని అంగీకరించగా, ఆయా దొంగతనాల కేసులు సంబంధిత పోలీస్ స్టేషన్లలో నమోదు చేయబడిన కేసులలో దర్యాప్తు కొనసాగుతోంది. ప్రజలు నకిలీ కరెన్సీ నోట్ల పట్ల అప్రమత్తంగా ఉండి అనుమానాస్పద నోట్లు లేదా వ్యక్తులు కనిపించిన వెంటనే దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్ ని లేదా 100 కి డయల్ చేయండి అని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం సబ్ డివిజన్ డిఎస్పి ఆదినారాయణ, జూలూరుపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీలక్ష్మి, చంద్రుగొండ ఎస్సై శివరామకృష్ణ, జూలూరుపాడు ఎస్ఐ బాదావత్ రవి, అన్నపురెడ్డిపల్లి ఎస్సై విజయసింహారెడ్డి, ఈ కార్యక్రమం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Image 1

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!

Posted On 2026-08-08 04:36:39

Readmore >
Image 1

వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

Posted On 2026-08-07 16:00:29

Readmore >
Image 1

చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...

Posted On 2026-08-07 15:27:03

Readmore >
Image 1

మున్సిపల్ సమస్యలపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి...

Posted On 2026-08-07 14:59:52

Readmore >
Image 1

కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి

Posted On 2026-08-07 14:58:17

Readmore >
Image 1

మెగా రక్తదాన శిబిరం విజయవంతం... 98 యూనిట్ల రక్త సేకరణ

Posted On 2026-08-07 14:55:55

Readmore >
Image 1

పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-07 14:53:14

Readmore >
Image 1

"ప్రాణాలు కాపాడండి" అంటూ రోడ్డెక్కిన విద్యార్థులు...

Posted On 2026-08-07 12:34:53

Readmore >
Image 1

హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి

Posted On 2026-08-07 12:07:52

Readmore >
Image 1

భర్తను చంపేందుకు భార్య, ప్రియుడి కుట్ర...

Posted On 2026-08-07 11:48:51

Readmore >