Posted on 2026-02-10 15:17:37
30 తులాల వెండి ఆభరణాలు రికవరీ
వివరాలు వెల్లడించిన వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్.
డైలీ భారత్, వేములవాడ: బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామానికి చెందిన కొంకటి తిరుపతి ఇంట్లో తేదీ 07.02.2026 తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి వెండి పూజా వస్తువులను దొంగిలించగా కొంకటి తిరుపతి బోయినపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా ఎస్.ఐ రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలో సాక్ష్యాల ఆధారంగా నిందుతులు సిద్దిపేట జిల్లా,చేర్యాల మండలం,ముస్త్యాల గ్రామనికి చెందిన కంచు శివ శంకర్ మరియు సంజీవయ్య నగర్, సిరిసిల్ల, ప్రస్తుతం వేములవాడ సుబాష్నగర్ చెందిన
సామల్ల బాలకిషన్ గా గుర్తించడం జరిగిందని, వీరిని పట్టుకువడానికి బోయినపల్లి ఎస్.ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టగా సాంకేతికత ఆధారంగా నిందుతులను ఈరోజు కోదురుపాక చౌరస్తా వద్ద బస్సు కోసం వేచి ఉండగా అదుపులోకి తీసుకొని వారి వద్ద 30 తులాల వెండి ఆభరణాలు, స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించడాం జరిగిందన్నారు.
నిందుతుల వివరాలు...
A-1 కంచు శివ శంకర్, తండ్రి కృష్ణ, వయసు 20 సంవత్సరాలు, వృత్తి: మొబైల్ రిపేర్ షాప్లో పని,ముస్త్యాల గ్రామం, చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లా.
A-2 సామల్ల బాలకిషన్, తండ్రి దేవయ్య, వయసు 30 సంవత్సరాలు, వృత్తి: టీ స్టాల్ నిర్వహణ, సంజీవయ్య నగర్, సిరిసిల్ల, ప్రస్తుతం వేములవాడ సుబాష్నగర్.
త్వరితగతిన కేసు చేధించిన ఎస్.ఐ రమాకాంత్, ప్రింగర్ ప్రింట్ ఎస్.ఐ క్రాంతి, సిబ్బంది కోటి, లక్ష్మీనారాయణ, సుధాకర్, వెంకటేష్ లను వేములవాడ రూరల్ సి.ఐ ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,గ్రామాలలో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
షాద్ నగర్ మున్సిపాలిటీ 25 వార్డు కాంగ్రెస్ అభ్యర్ధి సి.పెంటయ్య విజయం
Posted On 2026-02-13 15:28:44
Readmore >
తాళాలు వేసి ఉన్న ఇండ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను అరెస్టు చేసిన చండ్రుగొండ పోలీసులు
Posted On 2026-02-10 15:52:53
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : దొంగతనం కేసులో ఇద్దరు నిందుతుల అరెస్ట్,రిమాండ్
Posted On 2026-02-10 15:17:37
Readmore >
మున్సిపల్ ఎన్నికలు బాధ్యతాయుతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి
Posted On 2026-02-10 15:11:28
Readmore >
అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ ను పరిశీలించిన ఇంచార్జి కలెక్టర్
Posted On 2026-02-10 14:32:27
Readmore >
బ్యాలెట్ బాక్సుల పంపిణీ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ బిరుదు రోహిత్ రాజ్
Posted On 2026-02-10 14:23:27
Readmore >
మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి : జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
Posted On 2026-02-10 13:03:20
Readmore >