Posted on 2026-02-10 19:47:37
30 తులాల వెండి ఆభరణాలు రికవరీ
వివరాలు వెల్లడించిన వేములవాడ రూరల్ సి.ఐ శ్రీనివాస్.
డైలీ భారత్, వేములవాడ: బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామానికి చెందిన కొంకటి తిరుపతి ఇంట్లో తేదీ 07.02.2026 తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి ఇంట్లోకి చొరబడి వెండి పూజా వస్తువులను దొంగిలించగా కొంకటి తిరుపతి బోయినపల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా ఎస్.ఐ రమాకాంత్ కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా సంఘటనా స్థలంలో సాక్ష్యాల ఆధారంగా నిందుతులు సిద్దిపేట జిల్లా,చేర్యాల మండలం,ముస్త్యాల గ్రామనికి చెందిన కంచు శివ శంకర్ మరియు సంజీవయ్య నగర్, సిరిసిల్ల, ప్రస్తుతం వేములవాడ సుబాష్నగర్ చెందిన
సామల్ల బాలకిషన్ గా గుర్తించడం జరిగిందని, వీరిని పట్టుకువడానికి బోయినపల్లి ఎస్.ఐ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపట్టగా సాంకేతికత ఆధారంగా నిందుతులను ఈరోజు కోదురుపాక చౌరస్తా వద్ద బస్సు కోసం వేచి ఉండగా అదుపులోకి తీసుకొని వారి వద్ద 30 తులాల వెండి ఆభరణాలు, స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించడాం జరిగిందన్నారు.
నిందుతుల వివరాలు...
A-1 కంచు శివ శంకర్, తండ్రి కృష్ణ, వయసు 20 సంవత్సరాలు, వృత్తి: మొబైల్ రిపేర్ షాప్లో పని,ముస్త్యాల గ్రామం, చేర్యాల మండలం, సిద్దిపేట జిల్లా.
A-2 సామల్ల బాలకిషన్, తండ్రి దేవయ్య, వయసు 30 సంవత్సరాలు, వృత్తి: టీ స్టాల్ నిర్వహణ, సంజీవయ్య నగర్, సిరిసిల్ల, ప్రస్తుతం వేములవాడ సుబాష్నగర్.
త్వరితగతిన కేసు చేధించిన ఎస్.ఐ రమాకాంత్, ప్రింగర్ ప్రింట్ ఎస్.ఐ క్రాంతి, సిబ్బంది కోటి, లక్ష్మీనారాయణ, సుధాకర్, వెంకటేష్ లను వేములవాడ రూరల్ సి.ఐ ప్రత్యేకంగా అభినందించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,గ్రామాలలో ఎటువంటి అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
ప్రతి కార్యాలయం పరిశుభ్రంగా ఉండాలి : కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-10 12:06:47
Readmore >
ప్రజల మధ్యకు వచ్చి సమస్యలు తెలుసుకున్న విద్యుత్ శాఖ అధికారులు
Posted On 2026-03-10 11:54:35
Readmore >
ప్రజావాణి అర్జీలు పెండింగ్ లో పెట్టవద్దు... కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-03-09 19:45:58
Readmore >
మద్యం, జూదం, వ్యసనపరులకు అడ్డగా మారిన భద్రాచలం ఎస్సీ కమ్యూనిటీ హాల్
Posted On 2026-03-09 19:22:17
Readmore >
కొమ్ముగూడెం గ్రామంలో నూతన పశువుల ఆసుపత్రి భవనాన్ని నిర్మించండి
Posted On 2026-03-09 19:20:29
Readmore >
ఐటిడిఏ కాంప్లెక్స్ దుకాణాల అన్యాక్రాంతం పై విచారణ జరిపించాలి
Posted On 2026-03-09 19:19:18
Readmore >
కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల క్షేత్రంలో శ్రీవారిని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు
Posted On 2026-03-09 19:17:48
Readmore >