Posted on 2026-02-08 21:30:21
నిందితుడి అరెస్ట్, రిమాండ్కు తరలింపు.
సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నేరస్థుడి గుర్తింపు .
చట్టం నుంచి ఎంతటి వారైనా తప్పించుకోలేరు.
బాన్సువాడ డిఎస్పి విఠల్ రెడ్డి వెల్లడి
డైలీ భారత్, కామారెడ్డి జిల్లా: తేదీ 06.02.2026 నాడు ఫిర్యాదుదారుడైన కోట సిద్ధులు S/o సంగయ్య, నివాసి పిట్లం గ్రామం, సాయంత్రం సమయంలో జాతీయ రహదారి-161 పక్కన తాను కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి వెళ్లగా అక్కడ రాజేష్, నివాసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం హత్యకు గురి అయి రక్తపు మడుగులో పడి ఉండగా వెంటనే పోలీస్ స్టేషన్ పిట్లం నందు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడింది.
జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆదేశాల మేరకు బాన్సువాడ SDPO విఠల్ రెడ్డి నేతృత్వంలో రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఒక బృందం బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య ఆధ్వర్యంలో, మరొకటి పిట్లం ఎస్ఐఐ వెంకట్ రావు ఆధ్వర్యంలో సాంకేతిక ఆధారాలు మరియు సికెమెరాల .సి. సహాయంతో నిరంతర దర్యాప్తు చేపట్టగా, తేదీ 08.02.2026 నాడు పిట్లం గ్రామంలోని శాంతినగర్ కాలనీలో నిందితుడు కిరాయికి ఉన్న ఇంటికి వచ్చి తన సామాన్లు సర్దుకొని పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీస్ బృందాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. విచారణలో నిందితుడు శ్రీకృష్ణ అలియాస్ శ్రీ కృశున్ (45 సంవత్సరాలు), వృత్తి: పెయింటర్, గోరఖపూర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మృతుడు రాజేష్ను కూలీ డబ్బుల విషయంలో తలెత్తిన గొడవలో కర్రతో కొట్టి హత్య చేసినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు.
మృతుడు రాజేష్ మరియు నిందితుడు శ్రీకృష్ణ గతంలో బెంగళూరులో కలిసి పని చేసేవారు. రాజేష్ మిత్రుడు దిలీప్ పిట్లం గ్రామంలో పెయింటింగ్ పనులు ఉన్నాయని చెప్పడంతో ఇద్దరూ అక్కడికి వచ్చారు. అయితే దిలీప్ కూలీ డబ్బులు చెల్లించకుండా గ్రామం విడిచి వెళ్లడంతో నిందితుడు మృతుడితో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలో కోట సిద్దులు నిర్మాణంలో ఉన్న ఇంటిలోకి రాజేష్ను తీసుకెళ్లి కర్రతో కొట్టి హత్య చేసి, అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ మరియు రూ.250/- నగదు దోచుకొని పరారయ్యాడు.
నిందితుడి వద్ద నుండి స్వాధీనం చేసిన వస్తువులు:
హత్యకు ఉపయోగించిన కర్ర
Mi కంపెనీకి చెందిన మొబైల్ ఫోన్ (మృతుడి వద్ద నుండి దొంగిలించినది)
రూ.100/- నగదు
రక్తపు మరకలతో ఉన్న దుస్తులు
ఈ కేసులో అతి తక్కువ సమయంలో నేరస్తుడిని పట్టుకోవడంలో చురుకైన పాత్ర పోషించిన తిరుపయ్య, బాన్సువాడ రూరల్ సీఐ, వెంకట్ రావు, పిట్లం ఎస్ఐ, మరియు కానిస్టేబుల్ కె. రఘు, వెంకటేష్, నవీన్ ను కామారెడ్డి జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారని బాన్సువాడ డీఎస్పీ తెలిపారు.
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >
ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చిత్రపటానికి పాలాభిషేకం
Posted On 2026-06-19 16:50:47
Readmore >
హైదరాబాద్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ కిడ్నీ చికిత్స విభాగంలో అరుదైన రికార్డు
Posted On 2026-06-19 16:24:52
Readmore >
అనుమతి లేని ఫాస్ట్ ఫుడ్ గోదాముపై దాడి చేసిన హెచ్-ఫాస్ట్ (H-FAST) బృందం
Posted On 2026-06-19 12:16:39
Readmore >