Posted on 2026-02-09 10:09:26
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, IPS.
డైలీ భారత్, వరంగల్: మున్సిపల్ ఎన్నికల సంబంధించి సోమవారం సాయంత్రం 5 గంటలకు ఎలక్షన్ ప్రచారం ముగుస్తుంది, తరువాత బయటి వ్యక్తులు ఎన్నికలు జరిగే ప్రాంతాలలో ఉండరాదు.
అలా ఉన్నట్లు అయితే వారిపై చర్యలు తప్పవని పోలీస్ కమీషనర్ తెలిపారు.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మున్సిపల్ ఎన్నికలు జరిగే జనగామ, ఘన్పూర్, పరకాల, నర్సంపేట, వర్ధన్నపేట పట్టణాల్లో ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగియనున్న నేపథ్యంలో, ఎన్నికల ప్రచారం నిమిత్తం బయటి ప్రాంతాల నుంచి వచ్చిన రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రచార సిబ్బంది మరియు ఇతరులు అందరూ తప్పనిసరిగా సోమవారం సాయంత్రం 5.00 గంటల లోపు తమ తమ గమ్యస్థానాలకు తిరిగి వెళ్లిపోవాలని వరంగల్ పోలీస్ కమీషనర్ తెలియజేయడమైనది. నిర్దేశిత సమయం అనంతరం కమిషనరేట్ పరిధిలో అనవసరంగా సంచరిస్తున్నట్లు గుర్తించినట్లయితే, సంబంధిత వ్యక్తులపై ఎన్నికల నిబంధనలు మరియు చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించడమైనది. ప్రజలు మరియు రాజకీయ పార్టీలు పోలీస్ శాఖకు సహకరించాలని పోలీస్ కమిషనర్ కోరడమైనది.
#warangal
రహదారి ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 18:00:32
Readmore >
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్లో మీడియా సమావేశం
Posted On 2026-04-17 17:28:53
Readmore >
విద్యార్థులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ - ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ పై ఎక్స్టెన్షన్ లెక్చర్
Posted On 2026-04-17 15:35:07
Readmore >