Posted on 2026-02-08 20:27:56
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా; షాద్నగర్ మున్సిపాలిటీ అభివృద్ధి కేవలం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తోనే సాధ్యమని సీనియర్ నాయకులు ఎం.డి. ఇబ్రహీం ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి దిలీప్ కుమార్ కు మద్దతుగా ఆయన వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి, దిలీప్ కుమార్ కు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.అనంతరం ఇబ్రహీం మాట్లాడుతూ గడిచిన రెండేళ్ల స్వల్ప కాలంలోనే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మున్సిపల్ పరిధిలోని అభివృద్ధి పనుల కోసం సుమారు 1350 కోట్ల రూపాయల భారీ నిధులను మంజూరు చేయించారని గుర్తు చేశారు. వార్డుల్లో కనిపిస్తున్న సిసి రోడ్లు, అత్యాధునిక అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, స్ట్రీట్ లైట్లు వంటి మౌలిక సదుపాయాలే ఇందుకు నిదర్శనమని ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో వార్డును మరింత ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని, ఎమ్మెల్యే ఆశీస్సులతో దిలీప్ కుమార్ ను గెలిపించుకోవాలని ఆయన వార్డు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొహమ్మద్ ఇసాక్,సత్తయ్య కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రహదారి ప్రమాదాల నివారణలో ప్రజల భాగస్వామ్యం అవసరం : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 18:00:32
Readmore >
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని యశోద ఓపి సెంటర్లో మీడియా సమావేశం
Posted On 2026-04-17 17:28:53
Readmore >
విద్యార్థులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ - ప్రిపరేషన్ ఆఫ్ ఎగ్జామ్స్ పై ఎక్స్టెన్షన్ లెక్చర్
Posted On 2026-04-17 15:35:07
Readmore >