| Daily భారత్
Logo




మహిళను వేధించిన కేసులో ఒక వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా

News

Posted on 2026-02-07 11:16:22

Share: Share


మహిళను వేధించిన కేసులో ఒక వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా

డైలీ భారత్, సిరిసిల్ల: మహిళను వేధించిన కేసులో ఒక వ్యక్తికి రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు 6000 జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ న్యాయమూర్తి ప్రవీణ్ తీర్పు వెల్లడించినట్లు కే. కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు..

సుభాష్ నగర్ కు చెందిన ఒక మహిళ యొక్క భర్త బతుకుదెరువు నిమిత్తం సౌదీ దేశంలో వెళ్లగా, ఆమెకు ఇద్దరు కూతుర్లు ముగ్గురు కుమారులు సంతానం కాగా తన కులానికి చెందిన ఎండి మజీద్ అను అతను తనపై దురుద్దేశంతో ఇబ్బందులకు గురి చేయొచు తను ఎటు పోయిన  వెంబడించడం రకరకాల ఫోన్ నెంబర్లనుండి ఫోన్ చేసి మాట్లాడడం, వేధింపులకు గురి చేయడం చేయగా తన కుల పెద్ద మనుషుల కు చెప్పగా అందుకు అతన్ని మందలించగా అతడు కొద్ది రోజులు ఊరుకున్నాడు. కొద్ది రోజులు మంచిగానే ఉండి మళ్ళీ పాతవిధాంగానే తనపై దురుద్దేశంతో వెంబడించడం తనతో ఫోన్లో మాట్లాడాలని తన కోరికలు తీర్చాలని వేధింపులకు గురిచేస్తున్నాడని, తేది. 22. 2.2021 నాడు బీడీల కంపెనీకి వెళ్ళుచుండగా సుభాష్ నగర్ సిరిసిల్లలోని యెల్ల లక్ష్మీనారాయణ ఇంటి ఎదురుగా మజీద్ వెంబడించి తన చెయ్యి పట్టుకుని లాగి తనతో ఫోన్ మాట్లాడాలని అతను చెప్పినట్లు విని అతని కోరికలు తీర్చాలని లేకపోతే చంపుతానని బెదిరించినాడని తన యొక్క పరువు తీసినాడు అని సుభాష్ నగర్ కు చెందిన ఒక మహిళ సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్పటి ఎస్సై జి.సుధాకర్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడు ఆయన ఎండి.మజీద్ సన్నాఫ్ యూసఫ్ అను అతన్ని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. అనంతరం ఎస్ఐ  కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. తర్వాత సీఎంఎస్ ఎస్ఐ.శ్రావణ్  ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ వేముల నరేష్ ఏడు (7)మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెలుమల సందీప్ వాదించగా కేసు పూర్వకరాలు పరిశీలించిన న్యాయమూర్తి ఏ ప్రవీణ్  నేరస్తుడు అయిన ఎండి.మజీద్ కు రెండు సంవత్సరాల జైలు శిక్షతోపాటు 6000 రూపాయల జరిమానా విధించడం జరిగిందని సిరిసిల్ల పట్టణ ఇన్స్పెక్టర్ కే కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

Image 1

నకిలీ బంగారం చూపి దోపిడీ.. ఏడుగురు ముఠా సభ్యుల అరెస్ట్

Posted On 2026-06-20 07:55:27

Readmore >
Image 1

ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS

Posted On 2026-06-19 21:55:09

Readmore >
Image 1

నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం

Posted On 2026-06-19 20:54:23

Readmore >
Image 1

గాంధారి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

Posted On 2026-06-19 20:36:40

Readmore >
Image 1

ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్‌ రికార్డు డిప్యూటీ ఇన్స్‌పెక్టర్‌

Posted On 2026-06-19 20:33:12

Readmore >
Image 1

రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం

Posted On 2026-06-19 19:17:58

Readmore >
Image 1

భూవివాదాలు లేని తెలంగాణ నిర్మాణ‌మే లక్ష్యం

Posted On 2026-06-19 19:13:38

Readmore >
Image 1

గాంధీ సరోవర్‌ ప్రాజెక్ట్‌కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్

Posted On 2026-06-19 19:11:46

Readmore >
Image 1

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీవీఎంసీ ఉద్యోగి

Posted On 2026-06-19 19:00:24

Readmore >
Image 1

దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్

Posted On 2026-06-19 17:52:08

Readmore >