Posted on 2026-02-07 09:21:31
డైలీ భారత్, తిరుపతి: నగరంలోని ఆయా వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శుక్రవారం ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
జరుగుతున్న పనులు, చేయాల్సిన పనుల పురోగతిపై అధికారులు కమిషనర్ కు వివరించారు.
ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ..
నగరంలో తాను పర్యటించిన సమయంలో ప్రజల నుండి చెప్పిన సమస్యలు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతుల మేరకు ప్రాధాన్యత గల పనులకు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆయా వార్డుల్లో ప్రజలకు అవసరమైన సి. సి. రోడ్లు, డ్రైనేజి కాలువల నిర్మాణం, కాలువల మరమ్మత్తులకు, ప్రజా ఉపయోగకరమైన పనులకు ప్రాధాన్యత ఇస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఎదో ఇచ్చారు, చేద్దాం అని కాకుండా అధికారులు తమ సిబ్బందితో సమన్వయం చేసుకుని పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే చేయాల్సిన పనులకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, డి.ఈ. లు మహేష్, రాజు, మధు, వెంకట ప్రసాద్, లలిత, శిల్ప, రమణ, టెక్నికల్ ఆఫీసర్ రజని పాల్గొన్నారు.
#Tirupati #MCT #maud_municipal #cdma_municipal #development #apcm #NCBN
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >