Posted on 2026-02-07 09:21:31
డైలీ భారత్, తిరుపతి: నగరంలోని ఆయా వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య, ఐఏఎస్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై శుక్రవారం ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
జరుగుతున్న పనులు, చేయాల్సిన పనుల పురోగతిపై అధికారులు కమిషనర్ కు వివరించారు.
ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ..
నగరంలో తాను పర్యటించిన సమయంలో ప్రజల నుండి చెప్పిన సమస్యలు, ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన వినతుల మేరకు ప్రాధాన్యత గల పనులకు వర్క్ ఆర్డర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఆయా వార్డుల్లో ప్రజలకు అవసరమైన సి. సి. రోడ్లు, డ్రైనేజి కాలువల నిర్మాణం, కాలువల మరమ్మత్తులకు, ప్రజా ఉపయోగకరమైన పనులకు ప్రాధాన్యత ఇస్తూ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఎదో ఇచ్చారు, చేద్దాం అని కాకుండా అధికారులు తమ సిబ్బందితో సమన్వయం చేసుకుని పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే చేయాల్సిన పనులకు కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.
ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, డి.ఈ. లు మహేష్, రాజు, మధు, వెంకట ప్రసాద్, లలిత, శిల్ప, రమణ, టెక్నికల్ ఆఫీసర్ రజని పాల్గొన్నారు.
#Tirupati #MCT #maud_municipal #cdma_municipal #development #apcm #NCBN
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >