Posted on 2026-02-06 19:05:02
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ప్రభుత్వ పథకాలు అన్ని ప్రతి ఒక్క లబ్దిదారులకు అందజేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యం అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా షాద్ నగర్ మున్సిపాలిటీలోని 12 వార్డు అభ్యర్ధి కలంకర్ దిలీప్, 13 వార్డు అభ్యర్ధి రిజ్వాన బేగం ముబారక్ అలి,14 అభ్యర్ధి అందే మోహన్ వార్డులలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డిలతో కలిసి మంత్రి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని ఆరా తీశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందజేస్తున్నామని తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం మహిళా సంఘాలకు పెట్రోల్ పంప్ లను, ప్రభుత్వ ఆసుపత్రులలో, విద్యాలయాలలో క్యాంటీన్లను మంజూరు చేసి ఆర్థికంగా బలపడేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు దారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం, మహాలక్ష్మి పథకం లో ఉచిత బస్సు సౌకర్యం, వడ్డీ లేని రుణాలు అందుతున్నాయా, ఎలా అమలవుతున్నాయంటూ ప్రజలను అడిగి మంత్రి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందుతాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. షాద్ నగర్ మున్సిపాలిటీలో 28 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి మున్సిపల్ పై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని మంత్రి ప్రజలను కోరారు.
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >