Posted on 2026-02-06 17:45:02
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఏజెన్సీ ప్రాంత వాసులకు మెరుగైన రవాణా సౌకర్యాలను అందించేందుకు వద్దిపేట,పూసుగుప్ప గ్రామాల మధ్యలో నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మితమవుతున్న బ్రిడ్జి పనులను శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పరిశీలించారు.బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అక్కడ ఉన్న అధికారులకు సూచించారు.
దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ సందర్శించిన ఎస్పీఎస్పీ రోహిత్ రాజు దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ ను సందర్శించి అక్కడ విధులలో ఉన్న పోలీస్ అధికారులు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా,సైబర్ నేరాల పట్ల ప్రజలకు నిరంతరం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సిబ్బంది సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్,ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్సై గణేష్,మరియు సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >