Posted on 2026-02-05 19:02:01
డైలీ భారత్, గణపురం: ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో ఈనెల 15 ఆదివారం నిర్వహించే శివరాత్రి మహోత్సవాలకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమ గోడపత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15, 16 ,17 తేదీల్లో నిర్వహించే కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలోట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి , గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, చెల్పూర్ సొసైటీ చైర్మన్ గండ్ర సత్యనారాయణరెడ్డి, రాజ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేపాక రాజేందర్, మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, గాంధీనగర్ సర్పంచ్ ఇంజపెల్లి శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి చోటెమియా, లింగంపల్లి వేణుగోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >