Posted on 2026-02-05 14:32:01
డైలీ భారత్, గణపురం: ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో ఈనెల 15 ఆదివారం నిర్వహించే శివరాత్రి మహోత్సవాలకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. గురువారం కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమ గోడపత్రికను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15, 16 ,17 తేదీల్లో నిర్వహించే కార్యక్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని ఈ సందర్భంగా అన్నారు. అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని శాలువాలు పూలమాలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలోట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి , గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్, కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు మామిండ్ల మల్లికార్జున్ గౌడ్, చెల్పూర్ సొసైటీ చైర్మన్ గండ్ర సత్యనారాయణరెడ్డి, రాజ్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రేపాక రాజేందర్, మాజీ వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, గాంధీనగర్ సర్పంచ్ ఇంజపెల్లి శ్రీనివాస్, మాజీ కోఆప్షన్ సభ్యులు ఎండి చోటెమియా, లింగంపల్లి వేణుగోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుండి కొత్త రేషన్ కార్డుల పంపిణీ!
Posted On 2026-08-08 04:36:39
Readmore >
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >