Posted on 2026-02-05 21:17:24
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: ఫిబ్రవరి 11వ తేదీన నిర్వహించే మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యత గా పని చేయాలని సంబంధిత అధికారులకు ఎన్నికల అబ్జర్వర్ మయంక్ మిట్టల్ సూచించారు.
గురువారం శంకర్ పల్లి మున్సిపాలిటీకి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ సెంటర్, పోలింగ్ కేంద్రాన్ని ఎన్నికల అబ్జర్వర్ మయంక్ మిట్టల్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.నారాయణ రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈ సందర్బంగా ఎన్నికల అబ్జర్వర్ మయంక్ మిట్టల్, జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి శంకర్ పల్లి మున్సిపాలిటీకి సంబంధించిన ఏర్పాట్లను, ఎన్నికల సామగ్రిని పరిశీలిస్తు అధికారులకు సిబ్బందికి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఎన్నికలకు సంబంధించిన స్టేషనరీ తదితర అంశాలను మున్సిపల్ కమిషనర్ యోగేష్ ను అడిగి తెలుసుకొని వాటిని పరిశీలించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అన్నీ వసతులు కల్పించాలని, స్ట్రాంగ్ రూమును, కౌంటింగ్ హాల్ ను, పోలింగ్ నిర్వహించే పాఠశాలను పరిశీలించారు. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అధికారులు, సిబ్బంది అందరూ కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, కౌంటింగ్ ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ వివరించారు.
కలెక్టర్ వెంట శంకర్ పల్లి తహశీల్దార్, సంబంధిత అధికారులు, తదితరులు ఉన్నారు.
తెలంగాణ కరణం నియోగ బ్రాహ్మణ సంఘం సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-03-14 22:05:48
Readmore >
ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి నూతన కార్యాలయం ప్రారంభం
Posted On 2026-03-14 19:39:44
Readmore >
జిల్లాలో వరుస నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్లో ఇద్దరి అరెస్ట్ & రిమాండ్ కు తరలింపు
Posted On 2026-03-14 19:33:15
Readmore >
మాజీ డిజిపి దొర పాడే మోసిన రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి,వీహైదరాబాద్ సిపి సజ్జనర్.
Posted On 2026-03-14 17:37:18
Readmore >
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >