| Daily భారత్
Logo




ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల సంతాపం తెలిపిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

News

Posted on 2026-02-01 18:42:03

Share: Share


ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి పట్ల సంతాపం తెలిపిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

నిషేధిత గంజాయి పై అధికారులు, ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల విధి నిర్వహణలో భాగంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య పై గంజాయి అరాచక ముఠా జరిపిన దాడిలో తొమ్మిది రోజులపాటు చావు బతుకులతో పోరాడుతూ శనివారం రాత్రి తుదిత్వాస విడిచిన ఆమెకు సంతాపం తెలుపుతూ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిషేధిత గంజాయి ఏరివేత కోసం తను నిర్వహిస్తున్న విధుల్లో భాగంగా  ఆమెను తీవ్రంగా దాడి చేయడాన్ని బిజెపి పార్టీ తరఫున తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అర్బన్ నియోజకవర్గం గంజాయి రహిత జిల్లాగా ఉండేటట్లు ఎక్సైజ్ అధికారులు ఇకపై గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చిన్న వయసులోనే ఉద్యోగం సంపాదించి ఎన్నో కలలు కన్న కానిస్టేబుల్ సౌమ్య తొమ్మిది రోజులపాటు చావు బతుకులతో పోరాడి శనివారం రాత్రి మరణించారనే వార్త తనకు ఎంతో బాధ కలిగించిందని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి వహించాలని ఎమ్మెల్యే  పేర్కొన్నారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే ఆర్థికంగా ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అన్నారు. అలాగే ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Image 1

చర్ల మండలంలో ఎన్సీపీ పార్టీలో 100 మంది యువకుల చేరిక

Posted On 2026-06-24 21:32:58

Readmore >
Image 1

ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్

Posted On 2026-06-24 21:31:42

Readmore >
Image 1

ఫ్యాన్ కు ఉరివేసుకొని మహిళా ఆత్మహత్య

Posted On 2026-06-24 19:18:46

Readmore >
Image 1

నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్‌ఐ జీనత్ కుమార్

Posted On 2026-06-24 19:13:12

Readmore >
Image 1

విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పోరాటం

Posted On 2026-06-24 19:11:52

Readmore >
Image 1

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 8 మందికి గాయాలు

Posted On 2026-06-24 17:55:51

Readmore >
Image 1

రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్

Posted On 2026-06-24 17:51:09

Readmore >
Image 1

జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ

Posted On 2026-06-24 17:45:21

Readmore >
Image 1

రూ. వేయి కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

Posted On 2026-06-24 17:44:27

Readmore >
Image 1

కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం

Posted On 2026-06-24 12:21:19

Readmore >