Posted on 2026-02-01 18:40:49
ఈ బడ్జెట్ వల్ల దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి మేలు చేకూరుతుంది
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆదివారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల వారికి లబ్ధి చేకూరుతుందని, ముఖ్యంగా పేద మరియు మధ్య తరగతి ప్రజలకు ఈ బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. రైతులకు, అలాగే రోజువారి పనులు చేసుకునే వారికి ఈ బడ్జెట్ ఎంతో ఉపయోగదాయకమని ఆయన అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ తో దేశం మరికొన్ని రోజుల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ప్రపంచంలోనే అన్ని దేశాలకు మార్గదర్శకంగా నిలిచి ప్రపంచ దేశాల సరసన నిలబడడం ఖాయమన్నారు. భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడుకి ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ఉపయోగం చేకూరుతుందని ఆయన అన్నారు. ఇప్పటివరకు ఏ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనలతో ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్ ను రూపొందించారని ఆయన కొనియాడారు. బడ్జెట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న కల్పితాలను ప్రజలు నమ్మకూడదని ఈ బడ్జెట్ కేవలం దేశాభివృద్ధి కోసమేనని ఆయన స్పష్టం చేశారు.
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >