Posted on 2026-02-01 08:35:12
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం లో సుజాతనగర్ లోని సుజాతనగర్ ఎస్సై తన సిబ్బందితో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా జూలూరుపాడు వైపు నుండి వస్తున్న బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా సుమారు మూడు టన్నుల అక్రమంగా చింతా మరియు వేప కర్ర గుర్తించడం జరిగింది. అట్టి కర్రలను అక్రమంగా తరలిస్తున్న జూలూరుపాడు మండలం అనంతారం కు చెందిన ముగ్గురు వ్యక్తులు ఈసం శేఖర్, తాటి జగదీష్, ముక్తి రామరాజులను మరియు డ్రైవర్ బానోత్ నరసింహ ను అదుపులోకి తీసుకొని కర్రతో కలిగిన వాహనంను మరియు ఈ నలుగురు వ్యక్తులను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లకు తగు చర్య నిమిత్తం అప్పగించడం జరిగింది. సరైన పత్రాలు లేనందున అక్రమంగా కలప మరియు కర్రల వ్యాపారం చేసే వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్నారు ఈ కార్యక్రమంలో సుజాతనగర్ ఎస్సై రమాదేవి, పోలీస్ సిబ్బంది మహేష్, హోంగార్డ్ లాజర్ లు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >
రాజారెడ్డి జనసేన ట్రస్టు ద్వారా పాఠశాలకు బెంచిలు, డెస్కులు పంపిణీ : ప్రధానోపాధ్యాయులు ధీటి మోహన్
Posted On 2026-06-24 17:51:09
Readmore >
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇస్తాం... కలెక్టర్ హామీ
Posted On 2026-06-24 17:45:21
Readmore >
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల శుభాకాంక్షల మధ్య గంపా గృహప్రవేశం
Posted On 2026-06-24 12:21:19
Readmore >