Posted on 2026-01-31 18:34:36
పార్టీలకు, కులాలకు, మతాలకతీతంగా తన నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తన లక్ష్యం
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: ఇందూరు అర్బన్ ఎమ్మెల్యేగా పేద రోగికి అండగా నిలిచి ధన్పాల్ సూర్యనారాయణ అర్హులైన వారికి ఎల్ఓసి పత్రాలను అందజేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి చెందిన గౌతమ్ నగర్ నివాసి షేక్ బాబు మియా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్లోని నిమ్స్ , పంజాగుట్ట ఆసుపత్రిలో అత్యవసర శస్త్రచికిత్స చేయించుకున్నారు. దీంతో బాధితుడికి బ్రౌన్ శస్త్రచికిత్స, కొలొస్టోమీ, దీర్ఘకాల ఐసీయూ చికిత్స, రక్త మార్పిడి వంటి వైద్య సేవల కోసం సుమారు రూ.10 లక్షల వరకు ఖర్చు అవుతుండటంతో, ఆ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోందన్నారు.
ఈ నేపథ్యంలో, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే మానవతా దృక్పథంతో స్పందించి సదరు పేద రోగికి ఎల్ఓసి (లెటర్ ఆఫ్ క్రెడిట్) ద్వారా ఆర్థిక సహాయం మంజూరు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఏ. రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు.
పార్టీలకతీతంగా ప్రజల ప్రాణాలను కాపాడడమే తన కర్తవ్యం అని ఇందుకు, ప్రభుత్వం సానుకూలంగా స్పందించి రోగికి తక్షణ సహాయం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
పిల్లల ఆన్లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం
Posted On 2026-06-25 12:51:14
Readmore >
మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు
Posted On 2026-06-25 12:21:26
Readmore >
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >