Posted on 2026-01-31 18:33:33
ప్రమాద సమయంలో బస్సులోనే విద్యార్థులు.. తప్పిన పెను ప్రమాదం
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నవీపేట్ మండలంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. స్టేషన్ ఏరియా సమీపంలో ఆదర్శ స్కూల్ బస్సులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో బస్సులో దాదాపు 50 మంది విద్యార్థులు ఉండటంతో అందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, బస్సు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తూనే, విద్యార్థులందరినీ సురక్షితంగా బస్సు కిందకు దింపడంతో పెను ముప్పు తప్పింది. ఫిట్నెస్ లేని బస్సులను రోడ్లపైకి అనుమతించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఆర్టీఏ అధికారుల నిర్లక్ష్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా తేటతెల్లమవుతుంది. ఇదే విద్యాసంవత్సరంలో జిల్లాలో ఇలాంటి స్కూల్ బస్సుల ప్రమాదాల ఘటనలు తరచుగా ఎక్కడో ఓ చోట జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు సదరు పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోకపోవడం పట్ల తీవ్ర విమర్శలు. మరోపక్క విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
పిల్లల ఆన్లైన్ గేమింగ్.. తల్లిదండ్రుల అజాగ్రత్తతో ఆర్థిక నష్టం
Posted On 2026-06-25 12:51:14
Readmore >
మాసబ్ ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో "సే నో టు డ్రగ్స్" అవగాహన సదస్సు
Posted On 2026-06-25 12:21:26
Readmore >
ఐటీసీ కార్మికుల కు డ్రగ్స్ పై అవగాహనా కార్యక్రమం నిర్వహించిన బూర్గంపాడు ఎస్ఐ మెడ ప్రసాద్
Posted On 2026-06-24 21:31:42
Readmore >
నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు : జూలూరుపాడు ఎస్ఐ జీనత్ కుమార్
Posted On 2026-06-24 19:13:12
Readmore >