Posted on 2026-01-24 12:30:25
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: కామారెడ్డిలోని సమీకృత కార్యాలయాల భవనంలో ఏసీబీ సోదాలు సంచలనం సృష్టించాయి. కలెక్టరేట్లోని సివిల్ సప్లయ్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9:30 గంటలకు కలెక్టరేట్కు చేరుకున్న ఏసీబీ అధికారులు సాధారణ వ్యక్తుల మాదిరిగా కలెక్టరేట్ మొత్తం కలియ తిరిగినట్టుగా తెలుస్తోంది. అనంతరం గంట తర్వాత సివిల్ సప్లయ్స్ కార్యాలయంలోకి వెళ్లి సిబ్బంది ఫోన్లు తీసుకుని సోదాలు ప్రారంభించినట్టుగా సమాచారం. కార్యాలయ సిబ్బంది ఎవరు ఏ విధులు నిర్వర్తిస్తారు అనే వివరాలు తీసుకుని కార్యాలయంలోని రికార్డులు తనిఖీలు చేపట్టారు. ఉదయం నుంచి ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఆకస్మికంగా ఏసీబీ సోదాలు జరగడం కలకలం రేపింది. ఈ తనిఖీల్లో భాగంగానే సోదాలు సర్వసాధారణంగా చేపడుతున్నారా..? లేక ఎవరైనా బాధితులు ఫిర్యాదు చేశారా... అనే విషయం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సోదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వాహనదారుల భద్రతే లక్ష్యం... సూర్యాపేట జాతీయ రహదారిపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు
Posted On 2026-08-07 16:00:29
Readmore >
చీరాల వేదికగా "నేతన్న నేస్తం" ఐదో విడత నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు...
Posted On 2026-08-07 15:27:03
Readmore >
కామారెడ్డి : ప్రతి పిటిషన్లపై తక్షణ స్పందన – CCTNSలో వెంటనే నమోదు చేసి రశీదు ఇవ్వాలి
Posted On 2026-08-07 14:58:17
Readmore >
పర్యావరణ పరిరక్షణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-07 14:53:14
Readmore >
హనుమకొండ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయండి
Posted On 2026-08-07 12:07:52
Readmore >