| Daily భారత్
Logo




ఎస్సీ డివిజన్ లపై హైకోర్టు లో బిజెపి పార్టీ వేసిన పిటీషన్ ను వెనక్కి తీసుకోవాలి

News

Posted on 2026-01-21 16:57:28

Share: Share


ఎస్సీ డివిజన్ లపై హైకోర్టు లో బిజెపి పార్టీ వేసిన పిటీషన్ ను వెనక్కి తీసుకోవాలి

ఎస్సీ సంఘాల ఐక్యవేదిక డిమాండ్.

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎస్సీ డివిజన్లపై హైకోర్టులో బిజెపి పార్టీ  వేసిన పిటిషన్ ను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని ఎస్సీ సంఘాల ఐక్యవేదిక బుధవారం డిమాండ్ చేసింది. ఇలా హైకోర్టులో పిటిషన్ వేయడం ఆ పార్టీకి సిగ్గుచేటు అని ఎస్సీ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎస్సీ లందరూ ఐక్యంగా ఉండి బిజెపి పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఎస్సీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రెస్ క్లబ్ నుండి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ చౌరస్తాలో బిజెపి దిష్టిబొమ్మ ను దహనం చేశారు.

ఈ సందర్భంగా ఎస్సీ సంఘాల ఐక్యవేదిక నాయకులు పులి జైపాల్, మల్యాల గోవర్ధన్, బంగారు సాయిలు, షేక్ హుస్సేన్, మల్లని శివ మాదిగ తదితరులు మాట్లాడుతూ ఎస్సీల పట్ల బిజెపి వైఖరి మరో మారు బయటపడిందన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కేవలం ఎస్సీ డివిజన్ లు 39, 40, 44 లలో  రిజర్వేషన్లను సవాలు చేస్తూ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి  పోతన్కర్ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం పట్ల దళితుల పట్ల బిజెపి వైఖరి మరో మారు బయటపడిందని అన్నారు. 60 డివిజన్ లలో రిజర్వేషన్లపై పిటిషన్ వేయాల్సిన వారు, వారి రాజకీయ లబ్ధి కోసం కేవలం ఎస్సీ డివిజన్ల పై వేసి ఎస్సీలను రాజకీయ బలి పశువులుగా చేస్తున్నారని అన్నారు, ఎస్సీల జోలికి వస్తే బిజెపి కి తగిన గుణపాఠం చెబుతామని అన్నారు, నిజామాబాద్ నగరంలోని ఎస్సీలు బిజెపి పార్టీ మన పట్ల వ్యవహరిస్తున్న తీరును పసిగట్టి బిజెపి అభ్యర్థులను రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని వారిని ఓడించడమే మన ఐక్యతకు నిదర్శనం అని పిలుపునిచ్చారు. ఈ వైఖరికి నిరసనగా రాబోయే కాలంలో మరిన్ని ఐక్య ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో టిఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు మల్లని శివ, మహిళా నాయకులు బంటు జ్యోతి, మాల మహానాడు నాయకులు వినయ్, దండు చంద్రశేఖర్, నీలగిరి రాజు, చందు, చంద్రకాంత్, రాజయ్య, భీమ్ ఆర్మీ అధ్యక్షులు అజయ్, జమాతే ఇస్లామీ హింద్ నాయకులు హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

Image 1

ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

Posted On 2026-08-04 14:15:02

Readmore >
Image 1

వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు

Posted On 2026-08-04 14:13:47

Readmore >
Image 1

"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి

Posted On 2026-08-04 13:06:14

Readmore >
Image 1

సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!

Posted On 2026-08-04 09:03:06

Readmore >
Image 1

యాప్‌ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్

Posted On 2026-08-04 08:26:26

Readmore >
Image 1

విధులను బహిష్కరించిన న్యాయవాదులు

Posted On 2026-08-04 08:12:56

Readmore >
Image 1

170 నిమిషాల్లో చరిత్ర... అగ్గిపెట్టెలో ఇమిడిన సిరిసిల్ల చీర

Posted On 2026-08-03 18:44:40

Readmore >
Image 1

వివాహేతర సంబంధం కోసం భార్యను చంపి నదిలో విసిరేసిన భర్త, ప్రియురాలి అరెస్ట్

Posted On 2026-08-03 16:58:20

Readmore >
Image 1

వరుస బైక్ చోరీలకు చెక్... వరంగల్ CCS, KUC పోలీసుల భారీ పట్టివేత - రూ.25 లక్షల 28 బైకులు రికవరీ

Posted On 2026-08-03 14:31:13

Readmore >
Image 1

చంద్రంపేట ఉన్నత పాఠశాలలో అత్యంత వైభవంగా బోనాల పండుగ

Posted On 2026-08-03 14:16:26

Readmore >