| Daily భారత్
Logo




కలెక్టర్ గా వచ్చిన వారం రోజుల్లోనే తమ ఆదేశాలు బేఖాతర్ చేసిన ప్రభుత్వ కీలక ఉద్యోగులపై కొరడా ఝాలిపించిన కలెక్టర్

News

Posted on 2026-01-13 09:12:05

Share: Share


కలెక్టర్ గా వచ్చిన వారం రోజుల్లోనే తమ ఆదేశాలు బేఖాతర్ చేసిన ప్రభుత్వ కీలక ఉద్యోగులపై కొరడా ఝాలిపించిన కలెక్టర్

ప్రజావాణి కి డుమ్మా కొట్టిన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ..

డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: సరిగ్గా జిల్లాకు వారం రోజుల ముందు బదిలీపై వచ్చిన జిల్లా కలెక్టర్ ఇల త్రిపాఠి గతంలో అనే కలెక్టర్గా పనిచేసిన జిల్లాల్లో విధుల్లో నిక్కచ్చిగా కఠినంగా ఉంటూ జిల్లా పాలన వ్యవస్థను గాడిలో పెట్టిన పేరున్న కలెక్టర్ ఆమె జిల్లాకు వచ్చి రాగానే మొదటి ప్రజావాణిలో ప్రజల సమస్యల పరిష్కార వేదిక అయిన ప్రజావాణికి అన్ని శాఖల ఉన్నత అధికారులు తప్పకుండా హాజరుకావాలని ప్రజలు సమస్యలు ఏంటో ప్రజావాణి ద్వారా వినాలని ఆమె వచ్చి రాగానే అధికారులకు ఆదేశించారు. అయినప్పటికీ ఇన్నాళ్లు ప్రజావాణి అంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆయా శాఖ ఉన్నతాధికారులు ప్రజావాణికి హాజరు కాకపోగా కిందిస్థాయి సిబ్బందిని ప్రజావాణికి పంపిస్తూ నిర్లక్ష్యంగా చేతులు దులుపుకునేవారు. అయితే గత వారమే జిల్లాకు బదిలీపై వచ్చిన కలెక్టర్ ప్రజావాణిలో అన్ని శాఖల ఉన్నతాధికారులు తప్పకుండా హాజరు కావాల్సిందే అంటూ స్వయంగా కలెక్టరే చెప్పిన ఆమె ఆదేశాలను జిల్లా కు చెందిన ఆయా శాఖలో ఉన్న ఉన్నతాధికారులు బేఖాతలు చేశారు. దీంతో ప్రజావాణికి డుమ్మా కొట్టిన అధికారులపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తోలిసారి కొరడా ఝులిపించారు. ప్రజావాణి కార్యక్రమానికి పలు శాఖల అధికారులు గైర్హాజరు అయ్యారు. దీనిని గమనించిన కలెక్టర్  ప్రజావాణి వినతుల స్వీకరణ పూర్తయిన అనంతరం ఒక్కో శాఖ వారీగా అధికారులు హాజరు జాబితా పరిశీలించారు. సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి గైర్హాజర్ అయిన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ముందస్తు సమాచారం అందించకుండా పలు శాఖల అధికారులు ప్రజావాణికి గైర్హాజరు కావడం పట్ల కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. సదరు అధికారులకు షోకాజ్ మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఇది మొదటి తప్పుగా భావించి, మెమోలతో సరిపెడుతున్నామన్నారు. ఇక నుంచి గైర్హాజర్ అయితే అధికారుల పై కఠిన చర్యలు ( వేతనాల్లో కోతలు తప్పవని) తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తెరిగి జిల్లా అధికారులు పాల్గొనాలని అన్నారు.

Image 1

₹35 వేల లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ ఎగ్జామినర్ పట్టుబాటు

Posted On 2026-03-06 07:54:12

Readmore >
Image 1

తెలంగాణకు కొత్త గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా

Posted On 2026-03-06 07:46:55

Readmore >
Image 1

2003 DSC ఉపాధ్యాయుల చలో హైదరాబాద్ మహా విజ్ఞాపన సభకు టీపీటీఫ్ పూర్తి మద్దతు

Posted On 2026-03-05 22:09:37

Readmore >
Image 1

ఓంకారేశ్వర ఆలయా అభివృద్ధికి కృషి చేస్తా సైంటిస్ట్ పైడి ఎల్లారెడ్డి

Posted On 2026-03-05 22:08:10

Readmore >
Image 1

ఆపరేషన్ నిమిత్తమై సకాలంలో బి పాజిటివ్ రక్తం అందజేత

Posted On 2026-03-05 22:07:03

Readmore >
Image 1

శీర్షిక: మంజుల అనే నేను

Posted On 2026-03-05 22:05:42

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలకు కంప్యూటర్ అందజేసిన కెనరా బ్యాంకు మేనేజర్ వేగి శ్రీహరి

Posted On 2026-03-05 22:00:22

Readmore >
Image 1

కరకగూడెం మండలం అశ్వాపురం పాడు గ్రామంలో వ్యక్తి దారుణ హత్య పలువురు అరెస్ట్

Posted On 2026-03-05 21:59:32

Readmore >
Image 1

అబుదాబి విమానాశ్రయం సమీపంలో జరిగిన దాడిలో తెలంగాణ వ్యక్తి గాయపడ్డాడు

Posted On 2026-03-05 06:04:46

Readmore >
Image 1

సైన్య సేన ఆధ్వర్యంలో ఉగాది పండుగ సందర్భంగా వృద్ధులకు దుస్తులు పంపిణీ

Posted On 2026-03-04 23:23:12

Readmore >