Posted on 2026-01-12 17:34:35
డైలీ భారత్, సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో కీ.శే మంకు రాజయ్య జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న టీచర్స్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ ను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ సోమవారం రోజున ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతు జాతీయ అవార్డు గ్రహీత, కీర్తీ శేషులు మంకు రాజయ్య గారు చిరస్మనీయులు అని,వారు విద్యారంగానికి ఎనలేని సేవలు అందించారని,ఉపాధ్యాయులందరూ ఐక్యమత్యాంగా ఉండేలా ఆహ్లాదకరమైన వాతావరణంను పెంపొందించేలా ఈ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు.. ఈ టోర్నమెంట్ లో జిల్లాలోని 13 మండలాల నుండి ఉపాధ్యాయులను 6 జట్లుగా విభజించి లీగ్ పద్ధతిలో మ్యాచ్లను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కే. కే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాకి చెందిన ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని, జిల్లా పేరుని రాష్ట్ర స్థాయిలో మారుమోగిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్,వివిధ మండలాల విద్యాధికారులు, నిర్వాహకులు శర్మన్ నాయక్,జయకృష్ణారెడ్డి, నవీన్,రవీందర్, భాస్కర్ రెడ్డి,రవి,తిరుపతి,సంతోష్, మల్లికార్జున్ మరియు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు,మంకు రాజయ్య అభిమానులు పాల్గొన్నారు
కామారెడ్డిలో ఘనంగా శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
Posted On 2026-03-07 18:14:07
Readmore >
వేం నరేందర్ రెడ్డి ని సన్మానించిన టీపీసీసీ స్టేట్ జనరల్ సెక్రెటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి
Posted On 2026-03-07 18:10:19
Readmore >
నిజాంసాగర్లో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం
Posted On 2026-03-07 11:49:37
Readmore >
శ్రీ శ్రీ గౌరీ సమేత ఓంకారేశ్వర స్వామి దేవాలయ చతుర్థి వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం
Posted On 2026-03-07 11:48:19
Readmore >