Posted on 2026-01-12 13:04:35
డైలీ భారత్, సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో కీ.శే మంకు రాజయ్య జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న టీచర్స్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ ను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ సోమవారం రోజున ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతు జాతీయ అవార్డు గ్రహీత, కీర్తీ శేషులు మంకు రాజయ్య గారు చిరస్మనీయులు అని,వారు విద్యారంగానికి ఎనలేని సేవలు అందించారని,ఉపాధ్యాయులందరూ ఐక్యమత్యాంగా ఉండేలా ఆహ్లాదకరమైన వాతావరణంను పెంపొందించేలా ఈ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు.. ఈ టోర్నమెంట్ లో జిల్లాలోని 13 మండలాల నుండి ఉపాధ్యాయులను 6 జట్లుగా విభజించి లీగ్ పద్ధతిలో మ్యాచ్లను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కే. కే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాకి చెందిన ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని, జిల్లా పేరుని రాష్ట్ర స్థాయిలో మారుమోగిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్,వివిధ మండలాల విద్యాధికారులు, నిర్వాహకులు శర్మన్ నాయక్,జయకృష్ణారెడ్డి, నవీన్,రవీందర్, భాస్కర్ రెడ్డి,రవి,తిరుపతి,సంతోష్, మల్లికార్జున్ మరియు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు,మంకు రాజయ్య అభిమానులు పాల్గొన్నారు
నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు
Posted On 2026-07-30 17:36:26
Readmore >
సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు
Posted On 2026-07-30 17:09:03
Readmore >
సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు
Posted On 2026-07-30 16:35:13
Readmore >
హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్
Posted On 2026-07-30 16:19:48
Readmore >
ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ
Posted On 2026-07-30 16:14:52
Readmore >
సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్
Posted On 2026-07-30 13:36:16
Readmore >