| Daily భారత్
Logo




మంకు రాజయ్య చిరస్మరణీయుడు : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

News

Posted on 2026-01-12 13:04:35

Share: Share


మంకు రాజయ్య చిరస్మరణీయుడు  : ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

డైలీ భారత్, సిరిసిల్ల:రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో కీ.శే మంకు రాజయ్య జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న టీచర్స్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ ను ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ సోమవారం రోజున ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతు జాతీయ అవార్డు గ్రహీత, కీర్తీ శేషులు మంకు రాజయ్య గారు చిరస్మనీయులు అని,వారు విద్యారంగానికి ఎనలేని సేవలు అందించారని,ఉపాధ్యాయులందరూ ఐక్యమత్యాంగా ఉండేలా ఆహ్లాదకరమైన వాతావరణంను పెంపొందించేలా ఈ టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు.. ఈ టోర్నమెంట్ లో జిల్లాలోని 13 మండలాల నుండి  ఉపాధ్యాయులను 6 జట్లుగా విభజించి లీగ్ పద్ధతిలో మ్యాచ్లను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కే. కే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాకి చెందిన ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని, జిల్లా పేరుని రాష్ట్ర స్థాయిలో మారుమోగిస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్,వివిధ మండలాల విద్యాధికారులు, నిర్వాహకులు శర్మన్ నాయక్,జయకృష్ణారెడ్డి, నవీన్,రవీందర్, భాస్కర్ రెడ్డి,రవి,తిరుపతి,సంతోష్, మల్లికార్జున్ మరియు వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు,మంకు రాజయ్య అభిమానులు పాల్గొన్నారు


Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >
Image 1

ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

Posted On 2026-07-30 16:14:52

Readmore >
Image 1

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు

Posted On 2026-07-30 16:09:18

Readmore >
Image 1

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-30 13:39:47

Readmore >
Image 1

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

Posted On 2026-07-30 13:36:16

Readmore >