| Daily భారత్
Logo




మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ వైరాలోనే కొనసాగించాలి

News

Posted on 2026-01-12 13:08:48

Share: Share


మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ వైరాలోనే కొనసాగించాలి

రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష పార్టీల డిమాండ్

డైలీ భారత్, వైరా:వైరాలో గల మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని బోనకల్‌కు తరలించడానికి ప్రభుత్వం పూనుకోవడం సరైన చర్య కాదని, ఎంవిఐ కార్యాలయాన్ని వైరాలోనే కొనసాగించాలని అఖిలపక్ష రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. సోమవారం వైరా సిపిఐ(ఎం)  కార్యాలయం బోడేపూడి వెంకటేశ్వరరావు భవనంలో సిపిఐ(ఎం) వైరా పట్టణ కార్యదర్శి చంతనిప్పు చలపతిరావు అధ్యక్షతన నిర్వహించిన అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీ వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, బీఆర్‌ఎస్ మండల కార్యదర్శి బాణాల వెంకటేశ్వర్లు, వైరా టౌన్ అధ్యక్షులు మద్దెల రవి, టీడీపీ నాయకులు సురేందర్, మోత్కూరు వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ 

వైరా, తల్లాడ, కొనిజర్ల, బోనకల్, మధిర, ఎర్రుపాలెం మండలాలకు కేంద్రంగా ఉన్న జంక్షన్ వైరా పట్టణమని, అలాంటి వైరాలోనే మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ కార్యాలయం ఉండటం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుందని వారు అన్నారు. రైతులు, ట్రాక్టర్లు, ఇతర వాహనాల రిజిస్ట్రేషన్ కోసం, డ్రైవింగ్ లైసెన్స్ పనుల కోసం బోనకల్‌కు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. వైరా అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంగా ఉన్న వైరాలోనే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మధిర ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క బోనకల్‌లో అవసరమైతే నూతనంగా సబ్ రిజిష్టేషన్  ఆఫీస్ ఏర్పాటు చేయాలని, కానీ వైరాలో ఉన్న కార్యాలయాన్ని మాత్రం తరలించకూడదని సూచించారు. వైరాలోని మోటార్ వెహికల్ కార్యాలయాన్ని తరలించే ప్రయత్నం చేస్తే ప్రజల ఆగ్రహాన్ని ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ ప్రాంతంలోని అన్ని మండలాల ప్రజలను సమీకరించి ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సిపిఐ(ఎం) పార్టి జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి కృష్ణ, వైరా మండల కార్యదర్శి బాణాల శ్రీనివాసరావు నాయకులు తోట నాగేశ్వరరావు, షేక్ నాగుల్ పాషా, కొంగర సుధాకర్, టీఆర్‌ఎస్ నాయకులు లాల్ మహమ్మద్, టీడీపీ నాయకులు శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు మనుబోలు వెంకటకృష్ణ, ఏదునూరు శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Image 1

నలుగు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరి, నలుగు ప్రాణాలు కాపాడిన పోలీసులు

Posted On 2026-07-30 17:36:26

Readmore >
Image 1

సుల్తానాబాద్ బాలసదన్ నుంచి తప్పిపోయిన ఇద్దరు మైనర్ బాలికలను 12 గంటల్లోనే సురక్షితంగా గుర్తించిన పోలీసులు

Posted On 2026-07-30 17:09:03

Readmore >
Image 1

సిరిసిల్ల : వర్షపు నీటితో అల్లాడుతున్న శ్రీనగర్ కాలనీవాసులు

Posted On 2026-07-30 16:35:13

Readmore >
Image 1

గణేష్ ఉత్సవాలకు ముందస్తు వ్యూహం

Posted On 2026-07-30 16:26:39

Readmore >
Image 1

వేములవాడ, సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Posted On 2026-07-30 16:24:01

Readmore >
Image 1

హిందీ భాషాభివృద్ధి కి కృషి... హిందీ ఫోరం అధ్యక్షులు ఇంద్రశేఖర్

Posted On 2026-07-30 16:19:48

Readmore >
Image 1

ఆధునిక యుగంలో సామాజిక మార్పునకు సోషల్ మీడియా శక్తివంతమైన ఆయుధం : పద్మశ్రీ మందకృష్ణ మాదిగ

Posted On 2026-07-30 16:14:52

Readmore >
Image 1

సలబత్‌పూర్ చెక్‌పోస్ట్ ఘటనపై ప్రాథమిక విచారణకు ఆదేశాలు

Posted On 2026-07-30 16:09:18

Readmore >
Image 1

ఎక్కడ ఉన్నది న్యాయం ఎక్కడ ఉన్నది ధర్మం... మంజుల పత్తిపాటి

Posted On 2026-07-30 13:39:47

Readmore >
Image 1

సోనుసూద్ జన్మదిన వేడుకల్లో బిజెపి చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్

Posted On 2026-07-30 13:36:16

Readmore >