డైలీ భారత్, కరీంనగర్: కరీంనగర్ లో జరిగిన విభాగ్ స్తాయి ఖేల్ కుద్ పోటీలలో సిరిసిల్ల నగరం లోని శ్రీ సరస్వతి శిశు మందిర్,గాంధీ నగర్ విద్యార్థులు పాల్గొని పతాకాలు గెలుపొందారు
క్యారమ్ బాల వర్గ పోటీలలో బాలికల విభాగం లో విభాగ్ స్తాయి లో ప్రథమ బహుమతి గోల్డ్ మెడల్ ను సాధించారు.
వారి పేర్లు గుండెల్లి వేదాశ్రీ, కుసుమ మనస్విని, గజ్జెని అక్షయ మరియు విభాగ్ బాల వర్గ లో క్యారమ్ పోటీలలో ద్వితీయ స్థానం లో సిల్వర్ మెడల్ నిలిచిన వారు ఆడెపు మణి విగ్నేష్, బూర శ్రీ వత్సవ, గున్నల సుజిత్, మెర్గు సన్విత్, వెల్ది రితేష్ లు నిలిచారు
వీరిని పాఠశాల సమితి సభ్యులు కత్తి మురళి కృష్ణ, గుడ్ల శ్రీధర్, కర్ణాల భద్రాచలం , రాపెల్లి ముకుందం, మరియు ప్రబంధాకారిణి అధ్యక్షులు చేపూరి నాగరాజు, పాఠశాల ప్రధానాచార్యులు చిలుక వేణు కిరణ్, మరియు మాతాజీ ల బృందం వీరిని అభినందించారు