| Daily భారత్
Logo




బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పై జిఎస్టి ఎగవేత కేసు...ఆయనను అరెస్టు చేసిన అధికారులు

News

Posted on 2026-01-07 12:53:37

Share: Share


బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పై జిఎస్టి ఎగవేత కేసు...ఆయనను అరెస్టు చేసిన అధికారులు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్, ఆరెంజ్ బస్సు ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి జిఎస్టి టాక్స్ ఎగివేతపై అటు కాంగ్రెస్ పార్టీలో, ఇటు ఆయన అనుచరుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే బాల్కొండ కాంగ్రెస్ ఇంచార్జ్ పై జిఎస్టి ఎగువేత కేసు నమోదు ఆ తర్వాత ఆయన అరెస్టు చక చక జరిగాయి. ఈ అంశం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్​టాపిక్​గా మారింది. సునీల్​ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్​ పార్టీలో చేరారు. అనంతరం పార్టీ నుంచి బాల్కొండ టికెట్​ దక్కించుకుని స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. అయితే కాంగ్రెస్​ అధికారంలోకి రాగా.. అప్పటి నుంచి బాల్కొండ నియోజకవర్గ వర్గ కాంగ్రెస్​ ఇన్​ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు.. గత కొన్నేళ్లుగా ఆరెంజ్​ ట్రావెల్స్ సంస్థను నడిపిస్తున్నారు. ప్రస్తుతం ఆరెంజ్‌ ప్యాసింజర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీగా కొనసాగుతున్నారు. ఇదే సమయంలో సునీల్ రెడ్డిని జీఎస్టీ ఎగవేత కేసులో డీజీజీఐ అధికారులు అరెస్ట్​ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ప్రస్తుతం బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్​లో నలుగురు నేతల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతోంది. ముగ్గురు కార్పొరేషన్​ ఛైర్లనకు తోడు సునీల్​ రెడ్డి నేతలు ఎవరికి వారుగా తమ అనుచర గణాన్ని తిప్పుకోవడం శ్రేణుల్లో గందగోళాన్ని పెంచింది. అంతేకాకుండా ఈ నలుగురు నేతలు నియోజకవర్గంపై పట్టుకోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సునీల్ రెడ్డి అరెస్టు కావడం ఆయన అనుచరుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇదే అదునుగా ఆయన వ్యతిరేక వర్గ నేతలు సునీల్​ అరెస్టు వ్యవహారాన్ని సోషల్​ మీడియాలో పోటీపోటీగా ప్రచారం చేయడం మరింత హీట్​ పెంచింది. కాగా.. ఆరెంజ్​ ట్రావెల్స్​కు సంబంధించి పన్ను ఎగవేత వ్యవహారం గత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ తెరపైకి వచ్చింది. దీనిపై తాజాగా డీజీజీఐ దూకుడు పెంచడం గమనార్హం. జీఎస్టీ ఎగవేత కేసులో సునీల్​ రెడ్డిని డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయనను రిమాండ్​కు తరలించారు. ఆరెంజ్​ ట్రావెల్స్​ ఎండీగా ఉన్న సునీల్​ రెడ్డి రూ.28.24 కోట్ల జీఎస్టీని వినియోగదారుల నుంచి వసూలు చేశారు. అయితే దానిని ప్రభుత్వానికి చెల్లించలేదని అధికారులు పేర్కొన్నారు. జీఎస్టీ చట్టం 2017 ప్రకారం అరెస్ట్​ చేశారు.

ఈ ఘటనపై ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా జీవితంలో ఉన్న తాను ఆరెంజ్​ ట్రావెల్స్​ సంస్థపై జరుగుతున్న విచారణపై వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ​ట్రావెల్స్​లో ప్రతి ఏటా యథావిధిగా నడుస్తున్న బస్సులపై 5శాతం జీఎస్టీ కడుతున్నట్లు తెలిపారు. కానీ జీఎస్టీ అధికారులు దానిని 12 శాతానికి పెంచి అదనంగా రూ.24 కోట్లు కట్టాలని సంస్థపై ఒత్తిడి చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై విచారణ జరుపుతున్నారని తెలిపారు. ఎన్నో కష్టాలను అధిగమించి నిత్యం ప్రజా సేవలో ఉంటున్నట్లు పేర్కొన్నారు. రెండు మూడు రోజుల్లో సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు

Image 1

మైనారిటీ గురుకులం విద్యార్థిని కాపాడిన ఆర్టీసీ

Posted On 2026-07-28 15:57:51

Readmore >
Image 1

రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్‌కు వినతి పత్రం

Posted On 2026-07-28 14:02:59

Readmore >
Image 1

కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు

Posted On 2026-07-28 14:01:16

Readmore >
Image 1

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం..

Posted On 2026-07-28 08:50:30

Readmore >
Image 1

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత

Posted On 2026-07-28 08:06:38

Readmore >
Image 1

అర్ధరాత్రి అప్రమత్తతతో వ్యక్తి ప్రాణాలు కాపాడిన రాజాపూర్ పోలీసులు

Posted On 2026-07-28 08:04:20

Readmore >
Image 1

శబరిమల దేవస్థానం ప్రధాన తంత్రిగా బ్రహ్మదత్తన్

Posted On 2026-07-28 02:28:38

Readmore >
Image 1

మతం మారితే..ఎస్సీ హోదా కోల్పోతారు

Posted On 2026-07-28 02:27:11

Readmore >
Image 1

అంగమలి - శబరిమల రైలు మార్గం భూసేకరణ ప్రారంభించిన కేరళ ప్రభుత్వం

Posted On 2026-07-27 18:35:56

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాస్థాయి యోగా పోటీల్లో ప్రతిభ చూపిన జూలూరుపాడు ఆరోగ్య జీవన యాత్ర మండల వాసులు

Posted On 2026-07-27 17:05:43

Readmore >