డైలీ భారత్, కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని గోవు ల ను చంపకూడదని గో హత్యలు ఉండకూడదని, 2 లక్షల 50 వేల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని కామారెడ్డి పట్టణంలో ని రామాలయం నుండి ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. దేశ ప్రధానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కి గవర్నర్కు వినతి పత్రాలను పంపించడం జరిగిందని సంఘ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్లాల్ పటేల్, యేల్లంకి సుదర్శన్, రామచంద్రం, కొవ్వులు భూమేష్, అర్షపల్లి రమేష్, ఉప్పల శ్రీను, గౌరీ శంకర్,తాటిపల్లిశ్రీను తదితరులు పాల్గొన్నారు.
News
గోమాతను విశ్వమాతగా ప్రకటించాలని ర్యాలీ, కలెక్టర్ కు వినతి పత్రం అందజేత