Posted on 2026-01-06 14:06:08
పీజీ మెడికో లతో వంతుల వారిగా వైద్యం
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పాత్రికేయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కేంద్రంలో వెల్నెస్ సెంటర్ ను ఏర్పాటు చేసి అందులో ఎంబిబిఎస్ వైద్యులను ప్రభుత్వం నియమించి ఓపి వైద్య సేవలను అందించడానికి వెల్నెస్ సెంటర్ కేంద్రం ప్రభుత్వ, రిటైర్డ్, పాత్రికేయుల కోసం ఈ సెంటర్ ను ఏర్పాటు చేయగా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వెల్నెస్ సెంటర్లో పూర్తిస్థాయి వైద్యులు లేకపోవడంతో రిటైర్డ్ ఉద్యోగులు, పాత్రికేయులు నానా ఇబ్బందులు పడుతున్నారు. కాగా నిజామాబాద్ వెల్నెస్ సెంటర్ లో విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. పూర్తిస్థాయి డాక్టర్లు లేకపోవడంతో చేసేదేమీ లేక వెల్నెస్ సెంటర్ ఇన్చార్జ్ అధికారిని పీజీ చదివే మెడికల్ విద్యార్థులతో వంతుల వారీగా రోజుకో మెడికల్ పీజీ స్టూడెంట్ ను రప్పించి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు, పాత్రికేయులకు కేవలం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓపి సేవలు అందిస్తున్నారు. వాస్తవానికి ముగ్గురు ఎంబిబిఎస్ వైద్యులు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఒక్క ఎంబిబిఎస్ వైద్యుడు కూడా సదరు వెల్నెస్ సెంటర్లో అందుబాటులో లేకపోవడం గమనార్హం. అందులో ఇదివరకు విధులు నిర్వహించిన ఎంబిబిఎస్ డాక్టర్లు రాజీనామా చేసి వేరే చోటికి వెళ్లినట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మధ్యాహ్నం నుండి వైద్యం చూపించడానికి వచ్చే రోగులకు వెల్నెస్ సెంటర్లో డాక్టర్లు లేకపోవడంతో తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇక మధ్యాహ్నం నుంచి కాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. అందులో పని చేసే ఉద్యోగులు సైతం ఫోన్లో కాలక్షేపాలు చేస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వెల్నెస్ సెంటర్లో పూర్తిస్థాయిలో విధులు నిర్వహించే డాక్టర్ను నియమించాలని రిటైర్డ్ ఉద్యోగులు, పాత్రికేయులు కోరుతున్నారు.
కామారెడ్డి : కళ్యాణలక్ష్మి పథకంలో భారీ మోసం బట్టబయలు... ముగ్గురి అరెస్ట్
Posted On 2026-07-28 17:42:20
Readmore >
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 71 మందికి కోర్టు శిక్షలు – ₹81,500 జరిమానా విధింపు
Posted On 2026-07-28 17:30:20
Readmore >
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఇబ్రహీం
Posted On 2026-07-28 17:21:37
Readmore >
భద్రాద్రి జిల్లాలో సైబర్ మోసం... రూ.3.20 లక్షలు హోల్డ్ చేసిన పోలీసులు
Posted On 2026-07-28 17:20:49
Readmore >
రాష్ట్ర అధ్యక్షులు బోట్ల కార్తీక్ ఆదేశాల మేరకు ఉప సర్పంచుల సమస్యలపై అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. విక్టర్కు వినతి పత్రం
Posted On 2026-07-28 14:02:59
Readmore >
కోర్టు విచారణల వీడియోలు సోషల్ మీడియాలో వినియోగంపై సుప్రీంకోర్టు కఠిన ఆంక్షలు
Posted On 2026-07-28 14:01:16
Readmore >