Posted on 2026-01-02 23:40:53
డైలీ భారత్, సిరిసిల్ల:రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజు పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మున్సిపల్ ఎన్నికలలో తమ తమ వార్డుల నుండి పోటీ చేయదలచుకున్న ఆశావాహుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పట్టణ కమిటీ సమావేశంలో పార్టీ బలోపేతం, ఎన్నికల వ్యూహం, వార్డు స్థాయి సమన్వయంపై విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ..
రాబోయే మున్సిపల్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి అత్యంత కీలకమైనవిగా నిలవనున్నాయి. ప్రజలకు నిబద్ధతతో పనిచేసే, సేవాభావం కలిగిన, పార్టీ సిద్ధాంతాలకు అంకితమైన కార్యకర్తలకే అవకాశం కల్పించబడుతుంది. వార్డు స్థాయిలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే నాయకత్వాన్ని బీజేపీ ముందుకు తీసుకువస్తుంది. ఈ ఎన్నికల ద్వారా సిరిసిల్ల పట్టణంలో బీజేపీ జెండా ఎగరేయడమే మా లక్ష్యం అని అన్నారు. పార్టీ క్రమశిక్షణ, ఐక్యత, సమిష్టి కృషితోనే విజయాన్ని సాధించగలమని, ప్రతి కార్యకర్త ఎన్నికలను సవాలుగా తీసుకుని పూర్తి స్థాయిలో పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పట్టణ కమిటీ సభ్యులు, వివిధ మోర్చాల నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >