Posted on 2026-01-02 23:21:36
డ్రైవింగ్ లో సీట్ బెల్ట్ తప్పని సరిగా పెట్టుకోవాలని సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ సూచించారు.
డైలీ భారత్ వేములవాడ: రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ సిబ్బంది శుక్రవారం వేములవాడ కమాన్ వద్ద కార్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు ప్రతి ఒక్కరూ పాటించాలని కార్ల వాహనదారులు సీటు బెల్ట్ పెట్టుకోవాలని, మద్యం తాగి నడపవద్దని, రాంగ్ రూట్ లో వెళ్లకూడదని, మొబైల్ మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని సూచించారు. స్పీడ్ కంట్రోల్ లో ఉండాలని, వాహనం రివర్స్ లో వెళ్లేప్పుడు తప్పనిసరిగా వాహనం కింద, వెనుక గమనించాలని పేర్కొన్నారు. సీటు బెల్టు పెట్టుకుని వాహనాన్ని నడిపిన వారికి స్వీట్లు పంపిణీ చేశారు. సీటు బెల్ట్ ధరించకుండా వాహనాలను నడిపిన వారికి దాని ప్రాముఖ్యత గురించి తెలిపారు. వాహనాలకు వాహన భద్రతా స్టిక్కర్లు అతికించారు. సీట్ బెల్ట్ పెట్టుకొని వాహనం నడుపుతామని వాహన దారులతో రోడ్డు భద్రతా మాసోత్సవాల ప్రతిజ్ఞ చేయించారు.
కార్యక్రమంలో వేములవాడ ట్రాఫిక్ ఎస్ఐ రాజు, మోటారు వాహనాల తనిఖీ అధికారి వంశీధర్, మోటార్ వాహనాల సహాయక తనిఖీ అధికారి రజిని, పృథ్వీరాజ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
#rajannasircilla
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >