Posted on 2026-01-02 23:11:22
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే లక్ష్యంతో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది అని కిషన్ నగర్ గ్రామ సర్పంచ్ నల్ల నర్సమ్మ నర్సింలు అన్నారు. శుక్రవారం ఫరూఖ్ నగర్ మండలం కిషన్ నగర్ గ్రామంలో ఇందిరమ్మ చీరల వారు పంపిణి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు చీర అందించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటివి మహిళల పేరుతోనే మంజూరు చేస్తున్నారని, వారి అభ్యున్నతికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వారు అన్నారు. అర్హులైన వారందరికీ చీరలు పంపిణీ జరుగుతుందని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కిషన్ నగర్ గ్రామ ఉప సర్పంచ్ ముక్కుపోగుల ప్రకాష్ గౌడ్, వార్డ్ సభ్యులు జోగు లక్ష్మి,భూషణ్, మీదెల అరుణ, ఏడ్ల లింగం,తడాకల సాయి కుమార్, సుగున్నమ, వంగ సరిత, కాంగ్రెస్ నాయకులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
#rangareddy
రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారిగా దేవునూరి శ్రీనివాస్
Posted On 2026-06-01 19:38:29
Readmore >
జిల్లా పోలీస్ శాఖలో ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్ఐలుగా పదోన్నతి
Posted On 2026-06-01 19:24:23
Readmore >
ప్రజావాణి దరఖాస్తులను ఆయా డివిజన్ పరిధిలోనే సమర్పించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలి
Posted On 2026-06-01 19:22:34
Readmore >
ధాన్యం కొనుగోళ్లు, అన్ లోడింగ్ లో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-06-01 11:10:15
Readmore >
పెరిక సంఘం : కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులకు సన్మానo
Posted On 2026-05-31 19:24:06
Readmore >