Posted on 2025-12-29 08:31:05
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా : సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులుగా గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి సూచించారు. ఆదివారం షాబాద్ కేంద్రంలో ఎస్సార్ పెట్రోల్ బంక్ యజమాని తాజోద్దీన్ వారి కుమారుడు సిరాజోద్దీన్ నూతనంగా గెలిచిన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డుసభ్యులను సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఛైర్మన్ ఎలుగంటి మదుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యానికి, గ్రామ స్వయంపాలనకు ఎప్పుడూ పెద్దపీట వేస్తుందని, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీల బలోపేతానికి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. గ్రామపంచాయతీలే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని, ప్రజలు ఇచ్చిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని సర్పంచ్లకుసూచించారు. తాగునీరు, పారిశుధ్యం, రోడ్లు, విద్యుత్, విద్య, ఆరోగ్యం వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించాల్సిన బాధ్యత సర్పంచ్లదేనన్నారు. ఈ కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, నూతనంగా గెలిచిన సర్పంచులు అశోక్, లావణ్యచెన్నయ్య, ప్రభాకర్ రెడ్డి, స్వరూపమహేందర్ గౌడ్, శాంతమ్మయాదయ్య, ఉపసర్పంచ్ దండు రాహుల్ గుప్తా, వార్డుసభ్యులు చంద్రయ్య, శ్రీనివాస్, యోగేశ్వర్, సర్దార్నగర్ ఏఎంసీ డైరెక్టర్లు అక్తర్ పాషా, సంజీవరెడ్డి,నాయకులు ఖుద్దూస్, ఖాజామియాపటేల్, మోహిజోద్దీన్, సుభాష్ రెడ్డి, గౌరీశ్వర్, రమేష్, రామస్వామి, అంజనేయులు, నర్సింహులు, రాములు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతుల ప్రారంభానికి ప్రభుత్వ అనుమతులు
Posted On 2026-05-30 22:26:06
Readmore >
మెరుగైన వైద్య సేవలు అందించాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-05-30 22:23:35
Readmore >
నకిలీ విత్తనాలు ఇచ్చిన మొక్కజొన్న సీడ్ కంపెనీ పై చర్యలు తీసుకోవాలి...బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-05-30 17:55:56
Readmore >
మోడర్న్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ బాడీ మీటింగ్–2026 ఘనంగా ప్రారంభం
Posted On 2026-05-30 17:52:53
Readmore >
పదవీ విరమణ పొందిన పోలీసు అధికారికి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన సన్మానం
Posted On 2026-05-30 17:17:48
Readmore >
మహిళా సాధికారత, ఆర్థిక క్రమశిక్షణ మరియు కుటుంబాల ఎదుగుదల గురించి మాట్లాడిన మునిసిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్
Posted On 2026-05-30 17:15:14
Readmore >
ఏనుగుల వెంగళరావు కి లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరిన బీసీ సెల్ నాయకులు వెలిశాలరమేష్
Posted On 2026-05-30 17:10:26
Readmore >
ఇటీవల మరణించిన కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గుండ్లరేవు సర్పంచ్ భూక్యా చంద్రబాబు
Posted On 2026-05-30 17:09:29
Readmore >
వీఐపీ దర్శనాలపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం... దేవుడొక్కడే వీఐపీ..
Posted On 2026-05-30 07:56:46
Readmore >