Posted on 2023-09-14 11:13:27
డైలీ భారత్, చందుర్తి, సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో యువకుడు గురువారం ఉదయం దారుణ హత్యకు గురైన ఘటన తో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
వివరాల్లోకి వెళితే చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో గురువారం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పడిగేల నరేష్ (25) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి దారుణంగా హత్య చేశారు.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతుడు గత పది రోజుల కిందట గల్ఫ్ దుబాయ్ నుండి వచ్చినట్లుగా తెలిసింది.
ఘటన స్థలానికి సిఐ కిరణ్ కుమార్ వెళ్లి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా చందుర్తి మండలంలో ఇటీవల కాలంలో వరుస హత్యలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్న పోలీసులు
Posted On 2025-05-22 05:22:13
Readmore >దేశానికి రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివి: జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2025-05-21 17:29:16
Readmore >చౌదరిపల్లి 176 ఎకరాల లావుణి, అసైన్డ్ భూముల స్కాంపై విచారణకు ఆదేశించిన కలెక్టర్
Posted On 2025-05-20 07:24:46
Readmore >