Posted on 2025-12-24 19:34:59
అదే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న రోహిత్ అతని స్నేహితులపై అత్యాచార ఆరోపణలు..
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని ఖలీల్ వాడిలోని పూజ ఆసుపత్రిలో తోటి మహిళ ఉద్యోగిపై అత్యాచారయత్నంకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు వచ్చింది. విధుల్లో ఉన్న యువతిపై ఆసుపత్రి లో ఉద్యోగం చేస్తున్న రోహిత్ అనే యువకుడు తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారయత్నంకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన యువతి అతని నుంచి తప్పించుకుని డయల్ 100కు ఫోన్ చేసింది. దీంతో పోలీసులు అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని విచారించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు విచాణ చేపడుతున్నారు. అయితే ఇది ఇలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం జిల్లా కేంద్రంలోని ఓ డెంటల్ వైద్యుడు, తన స్నేహితుడైన రియల్ ఎస్టేట్ వ్యాపారి తో కలిసి ఓ వివాహితను కొంతకాలంగా లైంగికంగా వేధించిన ఘటన మరవకముందే మళ్లీ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడి ప్రాంతంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తాజాగా ఓ మహిళ ఉద్యోగిపై అత్యాచార్య ఘటన వెలుగు చూడడం పట్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అసలు ప్రైవేట్ ఆస్పత్రిలు అంటేనే సామాన్య ప్రజలు జంకుతున్న పరిస్థితి నెలకొంది. వైద్యం సంగతి అటు ఉంచితే, వైద్యం పేరిట దేవాలయాలాంటి ఆసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం శోచనీయం. అయితే ఇంత జరుగుతున్నప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రిలో ఇంత తతంగం జరుగుతున్న జిల్లా డిఎం అండ్ హెచ్ ఓ అధికారిని మాత్రం ఆస్పత్రిల పట్ల ప్రవేట్ ఆసుపత్రి వైద్యుల పట్ల ఇలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది.
కొత్తగూడెం రైల్వే స్టేషన్ నిర్మాణ పనులను తక్షణమే పూర్తి చేయాలి
Posted On 2026-04-28 22:51:46
Readmore >
మత్తుకు బానిసలై జీవితాలను చిత్తు చేసుకోవద్దు : కొత్తగూడెం డిఎస్పీ ఆదినారాయణ
Posted On 2026-04-28 22:34:17
Readmore >