Posted on 2025-12-24 15:06:12
రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం రెండు కళ్ళలాగా పనిచేస్తున్నారు..
ఇందుకు ఉదాహరణే గ్లోబల్ సమ్మిట్ లో లక్షల 70 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది
విలేకరుల సమావేశంలో పిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక విజన్ ఉన్న నాయకుడని, రాష్ట్ర అభివృద్ధి కోసం రెండు కళ్ళలాగా పనిచేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో జరిగిన గ్లోబల్ సమ్మిట్ మీట్ లో 70 లక్షల వేల కోట్ల లబ్ది కు ఒప్పందం కుదిరిందని ఆయన స్పష్టం చేశారు. పదేళ్ల విధ్వంసం నుండి వికాసం దిశగా ముందుకు వెళ్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లాను ఎడ్యుకేషన్ హబ్ గా మారుస్తున్నాం అని అన్నారు.
రాష్ట్రం మొత్తంలో అత్యధిక కాంగ్రెస్ సర్పంచులు నిజామాబాద్ జిల్లాలో గెలుపొందారని ఇది ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని స్పష్టం చేశారు. ఫిరాయింపుల అంశం స్పీకర్ ఫరీదిలో ఉందని, స్పీకర్ నిర్ణయాన్ని ప్రశ్నించటం ఏమీ లేదన్నారు. దానం నాగేందర్ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాం అని చెప్తున్నారని అన్నారు.
టెక్నికల్ గా పార్టీ మారలేదు అని చెప్తున్నారన్నారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉదాసీనతవాళ్లనే నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే జీఓ లు పారదర్శకంగా ఉన్నాయన్నారు. 90 శాతం జీఓ లు అన్ని పబ్లిక్ డిమైన్ లో పెట్టామన్నారు పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో ఒక్క జీవో కూడా బహిర్గతం చేయలేదని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ చాలా పెద్దనేరం అని, గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం చాలా పెద్ద నేరానికి పాల్పడిందన్నారు. నేరం ఎవరు చెప్పినా శిక్ష తప్పదని ఆయన అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, నూడా చైర్మన్ కేశవేణు, స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, అగ్రికల్చర్ సభ్యులు గడుగు గంగాధర్, సీనియర్ నాయకులు రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు
పండరి – స్వరూప కుటుంబానికి శ్రీ మాత సేవ చారిటబుల్ ట్రస్ట్ అండ
Posted On 2026-08-05 17:07:25
Readmore >
ఒక్క నంబర్తో 18 సేవలు... తెలంగాణలో డయల్ 112 లాంఛ్ చేసిన DGP సి.వి. ఆనంద్
Posted On 2026-08-05 14:58:50
Readmore >
దుబాయ్లో హై అలర్ట్... 20 నిమిషాల వ్యవధిలో 7 భారీ పేలుళ్లు... క్షిపణి దాడులా? ప్రమాదమా?
Posted On 2026-08-05 13:28:01
Readmore >
కామారెడ్డి : ఆన్లైన్ బెట్టింగ్ ముఠా కీలక నిందితుడు అరెస్ట్ - iPhone స్వాధీనం
Posted On 2026-08-05 13:09:21
Readmore >
ప్రజల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Posted On 2026-08-04 14:15:02
Readmore >
వెంకట్ సాయినగర్ కాలనీలో ఘనంగా శ్రీ మైసమ్మ అమ్మవారి 4వ, వార్షికోత్సవ వేడుకలు
Posted On 2026-08-04 14:13:47
Readmore >
"మిత్ర రత్నావళి" బిరుదుతో సత్కరించబడ్డ కవయిత్రి మంజుల పత్తిపాటి
Posted On 2026-08-04 13:06:14
Readmore >
సీఎం విజయ్, త్రిషపై అనుచిత వ్యాఖ్యలు... ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్!
Posted On 2026-08-04 09:03:06
Readmore >
యాప్ల ద్వారా ఎరువుల బుకింగ్ విధానం సరైనది కాదు : ఉసికల రమేష్
Posted On 2026-08-04 08:26:26
Readmore >