Posted on 2025-12-21 17:35:17
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:న్యాయాన్ని కోరుకుంటూ కోర్టులను ఆశ్రయించిన బాధితులకు తక్షణ న్యాయ సాయం అందే విధంగా న్యాయవాదులు కృషి చేయాలని హుజూర్ నగర్ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి రాధాకృష్ణ చౌహన్ న్యాయవాదులను కోరారు. ఆదివారం స్థానిక జిల్లా కోర్టు హాల్ నందు జరిగిన వీడ్కోలు సమావేశంలో ఆయన న్యాయవాదులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ న్యాయవాదులు అనునిత్యం అధునాతన న్యాయ గ్రంథాలను, న్యాయ శాస్త్రాలను,ఉన్నత న్యాయస్థానాలు వెలువరించే తీర్పులను నిరంతరం చదువుతూ న్యాయ విజ్ఞానం పెంపొందించు కోవాలని సూచించారు. హుజూర్ నగర్ కోర్టులో తను కొద్ది కాలం పాటే పనిచేసినప్పటికీ న్యాయ వాదులు నాకు సహకరించిన తీరు ఈ ప్రాంత వాతావరణం ఎన్నటికీ మర్చిపోలేనన్నారు. తన విధి నిర్వహణలో ఏదైనా సందర్భంలో కఠినంగా వ్యవహరిస్తే అది వృత్తిపరమైన చర్యలో భాగమే కాని వ్యక్తిగతం కాదన్నారు. తనకు అన్ని విధాలుగా సహకరించిన బార్ అసోసియేషన్ సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి మారుతి ప్రసాద్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఆయేషా సరీనా లు మాట్లాడుతూ తమకు ఉద్యోగ పరంగా ఏదైనా సందేహం ఏర్పడినప్పుడు అదనపు జిల్లా న్యాయమూర్తి చేత నివృత్తి చేసుకునే వారమని ఉద్యోగ పరంగా వారు మాకు అనేక రకాలుగా సహకరించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
వీర్లపల్లిలో పచ్చని మారణకాండ: ఎమ్మెల్యే నోట "పిచ్చి మొక్కల" మాట!
Posted On 2026-04-26 07:56:12
Readmore >
పెట్రోల్, డీజిల్ నిల్వలపై ఆందోళన వద్దు : కలెక్టర్ కృతిక శుక్ల
Posted On 2026-04-25 22:28:14
Readmore >
కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడ్ని కత్తితో పొడిచి చంపిన ప్రియురాలు
Posted On 2026-04-25 21:27:36
Readmore >