Posted on 2025-12-19 19:42:33
కొత్త గ్రామ పంచాయతీ పాలకవర్గాలు సమస్యల పరిష్కారంపై దృష్టిసారించాలి
డైలీ భారత్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం: కొత్త సర్పంచ్లు గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజల మన్ననలు పొందాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు పిలుపునిచ్చారు. వైరా నియోజకవర్గంలో గెలుపొందిన కొత్త గ్రామ పంచాయతీ పాలకవర్గాలకు శుక్రవారం ఆయన ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించడంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల వరకు రాజకీయాలు కొనసాగాలని, గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధిలో భాగస్వాములు కావాలని, బాధ్యతగా ప్రజాసేవ చేయాలని పిలుపునిచ్చారు. రెండేండ్లుగా గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కొత్త పాలకవర్గాలు ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. ప్రధానంగా తాగు నీరు, వీధి దీపాలు, పారిశుధ్యం, చెత్త సేకరణ తొలి ప్రాధాన్యతగా భావించి పనులు చేపట్టాలన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కేటాయించిన మాదిరిగా, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు సైతం నిధులు కేటాయించి పల్లెల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేయాలన్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లుతో కలిసికట్టుగా గ్రామస్తులను కలుపుకొనిపోయి అభివృద్ధి చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాతంగా జరిగినందుకు పార్టీ శ్రేణులకు, ప్రజలకు, అధికారులకు, పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సగర భగీరథ జయంతి ఉత్సవాల కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు సంకుబాపన అనుదీప్
Posted On 2026-04-23 18:39:41
Readmore >
జిల్లా కలెక్టర్ అంకిత్ IAS ప్రాథమిక ఆరోగ్య కేంద్రంపై ఆకస్మిక తనిఖీ
Posted On 2026-04-23 18:36:19
Readmore >
కామారెడ్డి పట్టణంలోని యశోద హాస్పిటల్ ఓపి సెంటర్లో విలేకర్ల సమావేశం
Posted On 2026-04-23 18:22:34
Readmore >
పాఠశాలలకు సెలవులు ఇచ్చిన సందర్భంగా తల్లిదండ్రులు పిల్లల పట్ల జాగ్రత్త వహించగలరు
Posted On 2026-04-23 16:50:12
Readmore >