Posted on 2025-12-16 07:08:52
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో బూరగడ్డ, లింగగిరి, శ్రీనివాసపురం గ్రామాలలో పోలీసులు కవాతు నిర్వహించారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు కాపాడడం, ఓటర్లలో భద్రతా భావన పెంపొందించడం లక్ష్యంగా ఈ కవాతు చేపట్టారు. పోలీస్ అధికారులు గ్రామ వీధుల గుండా కవాతు నిర్వహిస్తూ ప్రజలకు పలు సూచనలు చేశారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అక్రమాలకు, ప్రలోభాలకు, బెదిరింపులకు లోనుకావద్దని, ఏవైనా అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తులు కూడా పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు, ఎస్ఐ మోహన్ బాబు సహా పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ యూనివర్సిటీ పాలకమండలి సభ్యునిగా మహమ్మద్ ఘాజి నియామకం
Posted On 2026-04-17 10:15:59
Readmore >
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్
Posted On 2026-04-17 08:50:45
Readmore >
అటవీ, అసైన్డ్ భూముల సమస్యల పరిష్కారానికి వేగవంతమైన చర్యలు: జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:40:22
Readmore >
ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్ IAS
Posted On 2026-04-17 08:35:45
Readmore >
మహిళలందరూ అక్షరాస్యూలుగా అభివృద్ధి చెందాలి : గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి
Posted On 2026-04-17 08:16:17
Readmore >
ప్రియుడి పుట్టినరోజు కానుక కోసం ఖరీదైన వాచీలు దొంగిలించిన యువతి అరెస్ట్
Posted On 2026-04-17 08:15:29
Readmore >