Posted on 2025-12-16 07:08:52
డైలీ భారత్ న్యూస్, హుజూర్ నగర్:రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో బూరగడ్డ, లింగగిరి, శ్రీనివాసపురం గ్రామాలలో పోలీసులు కవాతు నిర్వహించారు.ఎన్నికల సమయంలో శాంతిభద్రతలు కాపాడడం, ఓటర్లలో భద్రతా భావన పెంపొందించడం లక్ష్యంగా ఈ కవాతు చేపట్టారు. పోలీస్ అధికారులు గ్రామ వీధుల గుండా కవాతు నిర్వహిస్తూ ప్రజలకు పలు సూచనలు చేశారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అక్రమాలకు, ప్రలోభాలకు, బెదిరింపులకు లోనుకావద్దని, ఏవైనా అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తులు కూడా పోలీసులకు సహకరించి శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు, ఎస్ఐ మోహన్ బాబు సహా పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
హెల్త్ కార్డులపై అపోహలు వద్దు : పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి
Posted On 2026-06-02 20:47:41
Readmore >
రాజన్న సిరిసిల్లలో పదవ తరగతి టాపర్లకు కేటీఆర్ "గిఫ్ట్ ఏ స్మైల్" ఐపాడ్ ల పంపిణీ
Posted On 2026-06-02 20:33:53
Readmore >
అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
Posted On 2026-06-02 18:31:15
Readmore >
రాజన్న సిరిసిల్ల : వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు... కాపాడిన కానిస్టేబుల్
Posted On 2026-06-02 16:26:43
Readmore >
రాష్ట్ర సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా కొడిప్యాక సాయిరాం పదోన్నతి
Posted On 2026-06-02 11:55:07
Readmore >
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన జిల్లా పోలీసు శాఖ
Posted On 2026-06-02 11:54:03
Readmore >