Posted on 2025-12-12 21:45:32
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:ఒక మహిళపై అత్యాచారం చేసిన కేసులో ముద్దాయి సాయినాథ్ కు పది సంవత్సరాల కఠిన జైలుశిక్ష విదిస్తూ నిజామాబాద్ ప్రత్యేక మహిళ కోర్టు స్పెషల్ సెషన్స్ జడ్జి డి. దుర్గా ప్రసాద్ శుక్రవారం తీర్పు చెప్పారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ తెలిపిన వివరాలు. నిజామాబాద్ నగరంలోని భూమారెడ్డి కన్వేషన్ దగ్గర నివాసముండే సాయినాథ్ కు పెళ్లి చేసుకున్న భార్యతో కాపురం ఉండేవాడు.అతని మరదలుపై కన్నుపడింది. ఆమెను ఎలాగైనా శారీరకంగా అనుభవించాలని మనసులో అనుకుని, ఆమె పని చేస్తున్న ప్రదేశంలోకి 29 నవంబర్, 2019 న బైక్ పైన తీసుకెళ్లి భూమారెడ్డి కన్వేషన్ దగ్గర ఉన్న తన ఇంటిలోకి తీసుకువెళ్లి బలవంతంగా అత్యాచారం చేశాడనే నేర అభియోగాలు రుజువు అయినట్లు నిర్దారణ కావడంతో సాయినాథ్ కు అత్యాచారం నేరంకుగాను పది సంవత్సరాల కఠిన జైలుశిక్ష విదిస్తూ న్యాయమూర్తి దుర్గా ప్రసాద్ తీర్పు వెలువరించారు. జైలిశిక్షతో పాటు పదివేల రూపాయల జరిమానా విధించారు. జరిమానా కట్టని యెడల అదనంగా ఆరు నెలల జైలుశిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.
రాబరీ కేసులో 4 గురు నిందితుల అరెస్టు... రూ.13.35 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
Posted On 2026-03-14 14:28:12
Readmore >
పెళ్లికి నిరాకరించిందని యువతికి ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎక్కించిన యువకుడు
Posted On 2026-03-14 13:05:35
Readmore >
గంజాయి రహిత సమాజమే లక్ష్యం: మారిచెట్లపాలెంలో పోలీసుల భారీ "కార్డన్ & సెర్చ్"
Posted On 2026-03-14 11:41:04
Readmore >
పదవ తరగతి పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే
Posted On 2026-03-14 11:10:04
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటు పడి మోసాలకు పాల్పడిన నిందితుల అరెస్ట్
Posted On 2026-03-13 19:19:09
Readmore >