" /> ." /> ." />
Posted on 2025-12-12 15:35:48
డైలీ భారత్ న్యూస్, రంగారెడ్డి జిల్లా : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) పేరు మారింది. పూజ్య బాపు గ్రామీణ్ రోజ్ గార్ యోజనగా పేరు మారుస్తూ శుక్రవారం కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే పనిదినాల సంఖ్యను 100 నుంచి 125కి పెంచింది. ఒక రోజుకు ఇచ్చే కనీస వేతనాన్ని రూ.240కి సవరించింది. పల్లెప్రాంత నిరుపేదలకు ఏడాదిలో వంద రోజులు ఉపాధి కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచడం, గ్రామీణ ప్రాంతాల్లో సుస్థిర ఆస్తుల కల్పన, వనరుల ఉత్పాదకత, అభివృద్ధి లక్ష్యాలుగా కేంద్ర ప్రభుత్వం "ఎన్ఆర్ఈజీఏ" పథకాన్ని 2006లో ప్రారంభించింది. తర్వాత దానిని మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంగా పేరు మార్చారు. (MGNREGA). ఇప్పుడు మరోసారి ఆ పేరు మార్పునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
జూలూరుపాడు మండలంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు...ఏడుగురు అరెస్ట్
Posted On 2026-07-30 05:57:41
Readmore >
సదాశివనగర్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-07-29 16:22:04
Readmore >
వర్షాల వేళ అప్రమత్తంగా కామారెడ్డి పోలీసులు – ప్రజల భద్రతకు ముందస్తు చర్యలు
Posted On 2026-07-29 16:19:52
Readmore >
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి
Posted On 2026-07-29 16:14:43
Readmore >